ETV Bharat / jagte-raho

పిడుగు పడి ఇద్దరు గీత కార్మికులకు తీవ్ర గాయాలు

author img

By

Published : Sep 18, 2020, 3:42 PM IST

జగిత్యాల గ్రామీణ మండలం కల్లెడలో తాటి చెట్టుపై పిడుగు పడింది. ప్రమాదంలో ఇద్దరు గీత కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

Two Gita workers were seriously injured in a lightning strike
పిడుగు పడి ఇద్దరు గీతా కార్మికులకు తీవ్ర గాయాలు

జగిత్యాల జిల్లాలో గత నాలుగు రోజులుగా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో జగిత్యాల గ్రామీణ మండలం కల్లెడలో తాటి చెట్టుపై పిడుగు పడింది. ప్రమాదంలో పెరుమల్ల కిష్టయ్య గౌడ్, పెరుమల్ల రాజేశం గౌడ్​ అనే ఇద్దరు గీత కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. అక్కడే ఉన్న మరో ముగ్గురు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.

క్షతగాత్రులను జగిత్యాలలోని ఓ ప్రైవేట్​ ఆసుపత్రికి తరలించి.. చికిత్స అందించారు. జిల్లాలో వరుసగా పిడుగు ప్రమాదాలు జరుగుతుండటం వల్ల వర్షాలు పడుతున్న సమయంలో రైతులు, కూలీలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

జగిత్యాల జిల్లాలో గత నాలుగు రోజులుగా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో జగిత్యాల గ్రామీణ మండలం కల్లెడలో తాటి చెట్టుపై పిడుగు పడింది. ప్రమాదంలో పెరుమల్ల కిష్టయ్య గౌడ్, పెరుమల్ల రాజేశం గౌడ్​ అనే ఇద్దరు గీత కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. అక్కడే ఉన్న మరో ముగ్గురు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.

క్షతగాత్రులను జగిత్యాలలోని ఓ ప్రైవేట్​ ఆసుపత్రికి తరలించి.. చికిత్స అందించారు. జిల్లాలో వరుసగా పిడుగు ప్రమాదాలు జరుగుతుండటం వల్ల వర్షాలు పడుతున్న సమయంలో రైతులు, కూలీలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఇదీచూడండి.. నేరెడ్‌మెట్‌ బండ చెరువులో బాలిక మృతదేహం లభ్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.