ETV Bharat / jagte-raho

బంధువుల ఇంటికి వెళ్లొచ్చేలోపే దోచేశారు!

author img

By

Published : Dec 18, 2020, 2:50 PM IST

బంధువుల ఇంటికి రాత్రి వెళ్లి తెల్లవారు జామున వచ్చే లోపే దోచేశారు. మెట్​పల్లి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం సమీపంలో ఓ ఇంట్లో దుండగులు చొరబడ్డారు. ఇంట్లోని సామాగ్రి అంతా చిందరవందర చేసి... బంగారం, నగలు ఎత్తుకెళ్లారు.

thieves-theft-gold-ornaments-and-money-at-metpally-in-jagtial
బంధువుల ఇంటికి వెళ్లొచ్చేలోపే దోచేశారు!

జగిత్యాల జిల్లాలో దొంగలు హల్​చల్​ చేశారు. మెట్​పల్లి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం సమీపంలో ఓ ఇంట్లో చొరబడ్డారు. ఎనుగందుల దశరథ్ గౌడ్ కుటుంబం బంధువుల ఇంటికి వెళ్లిన సమయంలో గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. దుండగులు ఇంట్లోకి ప్రవేశించి సామాగ్రి అంతా చిందరవందర చేశారు. బీరువాలను పగలగొట్టి సుమారు 11 తులాల బంగారు ఆభరణాలు, రూ.2 లక్షల నగదు దోచుకెళ్లారు.

స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేపట్టారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

జగిత్యాల జిల్లాలో దొంగలు హల్​చల్​ చేశారు. మెట్​పల్లి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం సమీపంలో ఓ ఇంట్లో చొరబడ్డారు. ఎనుగందుల దశరథ్ గౌడ్ కుటుంబం బంధువుల ఇంటికి వెళ్లిన సమయంలో గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. దుండగులు ఇంట్లోకి ప్రవేశించి సామాగ్రి అంతా చిందరవందర చేశారు. బీరువాలను పగలగొట్టి సుమారు 11 తులాల బంగారు ఆభరణాలు, రూ.2 లక్షల నగదు దోచుకెళ్లారు.

స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేపట్టారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి: మణికట్టు నరం కోసి... కోస్గిలో వ్యక్తి దారుణ హత్య!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.