ఏపీలోని విజయవాడ అజిత్ సింగ్ నగర్ పైపుల్ రోడ్ ఓ పచారీ దుకాణంలో చోరీ జరిగింది. అర్ధరాత్రి గుర్తు తెలియని ముగ్గురు యువకులు ద్విచక్రవాహనంపై వచ్చి దుకాణం తాళం పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు.
షాపులోని కొంత మొత్తం నగదును దొంగతనం చేస్తుండగా...సీసీ కెమెరాలకు చిక్కారు. విషయం తెలుసుకున్న టూటౌన్ కొత్తపేట పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని...సీసీ కెమెరాలను పరిశీలించారు. పాత నేరస్థులే ఈ దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించారు.