సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలకేంద్రంలో వ్యవసాయ పొలానికి వెళ్లేటప్పుడు విద్యుత్ వైరు తగిలి విద్యుదాఘాతంతో ఓ రైతు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గత పది రోజుల నుంచి పొలానికి వెళ్లే దారిలో విద్యుత్ వైర్లు తెగి కింద పడిపోయాయని, విద్యుత్ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవట్లేదని స్థానికులు తెలిపారు. రోజులా రైతు రాములు పొలం వద్దకు వెళ్తుండగా కరెంట్ వైరు అడ్డంగా ఉాందని.. పక్కకు తీసేటప్పుడు ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు.
గత నెల రోజుల నుంచి ఇలా గ్రామంలో కరెంట్ షాక్తో ముగ్గురు మరణించారని.. ఇదంతా విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమేనని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా స్పందించి.. అక్కడ ఉన్న విద్యుత్ వైరును తొలగించాలని మాజీ సర్పంచ్ ఆదివేను డిమాండ్ చేశారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండిః చేపలకు వెళ్లి చెరువులో పడి ఇద్దరు మృతి