రంగారెడ్డి జిల్లా చిట్టెంపల్లి గేట్ సమీపంలో మారుతి స్విఫ్ట్ కారు, ద్విచక్రవాహనం ఢీకొని ఒకరు అక్కడికక్కడే మృతిచెందారు. బైక్ పూర్తిగా తగలబడిపోయింది. మృతి చెందిన వ్యక్తి చిలకమర్రి గ్రామానికి చెందిన అనంతయ్యగా గుర్తించారు. చేవెళ్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కౌకుంట్ల నుంచి హైదరాబాద్కు వెళుతున్న విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. రోడ్డు ప్రమాదం వివరాలు తెలుసుకుని క్షతగాత్రులను పరామర్శించారు. అనంతరం చేవేళ్ల ఏసీపీకి ఫోన్ చేశారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చూడండి: అసహనం తగ్గాలంటే.. ఈ ఆసనాలు వేయాల్సిందే!