ETV Bharat / jagte-raho

సీఐ వేధిస్తున్నాడంటూ వికలాంగుడి ఆత్మహత్యాయత్నం - Mahabubabad crime news

మహబూబాబాద్ రూరల్ సీఐ వెంకటరత్నం రౌడీ​ షీటర్ కేసు నమోదు చేస్తానని వేధింపులకు గురి చేస్తున్నాడంటూ ఓ వికలాంగుడు ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. ఈ మేరకు ఓ లేఖ రాశాడు. బాధితుడు రాసిన లేఖ, అతడి భార్య తెలిపిన వివరాల ప్రకారం..

Suicide attempt by a disabled person for police harassment
సీఐ వేధిస్తున్నాడంటూ వికలాంగుడి ఆత్మహత్యాయత్నం
author img

By

Published : Sep 29, 2020, 9:51 AM IST

మహబూబాబాద్​ జిల్లా లక్ష్మీపురం (బి) గ్రామానికి చెందిన లావుఢ్య భద్రు కుటుంబానికి చారీ హరీష్​ రూ.1.40 లక్షలు అప్పుగా ఇచ్చాడు. వారు డబ్బులు తిరిగి ఇవ్వకపోగా.. ఘర్షణకు దిగి రూరల్​ పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. ఇదే విషయమై చారీ హరీశ్​ సైతం గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో డబ్బులు ఎగ్గొట్టాలనే ఉద్యేశంతో లావుఢ్య భద్రు భార్య కాంతమ్మ తన ఫోన్​ దొంగిలించావంటూ పలుమార్లు చారీ హరీశ్​కు ఫోన్​ చేసి దూషించింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే పోలీసులు చారీ హరీష్​ను స్టేషన్​కు పిలిపించగా.. పెద్దల సమక్షంలో రాజీ కుదుర్చుకున్నారు.

Suicide attempt by a disabled person for police harassment
చారీ హరీష్​ రాసిన లేఖ

ఈనెల 24న రాత్రి పోలీసులు చారీ హరీష్​కు ఫోన్​ చేసి నీపై రౌడీ షీట్​ నమోదు చేస్తున్నామని.. ఆధార్​ కార్డు తీసుకోని రావాలని తెలిపారని చారీ హరీష్​ పేర్కొన్నారు. తనపై అక్రమంగా కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. ఇది తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నాడు.

ఉదయం 11 గంటల సమయంలో ఇంట్లో పురుగుల మందు తాగి... మహబూబూబాద్​కు వెళ్లాలంటూ తన సోదరి కుమారుడి ద్విచక్రవాహనంపై ఎక్కాడు. మార్గమధ్యలో పురుగుల మందు తాగినట్లు ఫోన్​లో కుటుంబ సభ్యులకు తెలపడంతో వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించారు.

ఈ విషయంపై రూరల్​ సీఐ వెంకటరత్నంను వివరణ కోరగా.. లావుఢ్య భద్రు భార్య ఫిర్యాదు మేరకు చారీ హరీష్​ను పోలీస్​స్టేషన్​కు పిలిపించి విచారించాం తప్ప.. ఎలాంటి బెదిరింపులకు గురి చేయలేదని స్పష్టం చేశారు. గతంలోనే ఇతడిపై 354 సెక్షన్​ కింద కేసు నమోదైనట్లు వివరించారు.

ఇదీచూడండి: 'హేమంత్ హత్యోదంతం: 21కి పెరిగిన నిందితుల సంఖ్య'

మహబూబాబాద్​ జిల్లా లక్ష్మీపురం (బి) గ్రామానికి చెందిన లావుఢ్య భద్రు కుటుంబానికి చారీ హరీష్​ రూ.1.40 లక్షలు అప్పుగా ఇచ్చాడు. వారు డబ్బులు తిరిగి ఇవ్వకపోగా.. ఘర్షణకు దిగి రూరల్​ పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. ఇదే విషయమై చారీ హరీశ్​ సైతం గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో డబ్బులు ఎగ్గొట్టాలనే ఉద్యేశంతో లావుఢ్య భద్రు భార్య కాంతమ్మ తన ఫోన్​ దొంగిలించావంటూ పలుమార్లు చారీ హరీశ్​కు ఫోన్​ చేసి దూషించింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే పోలీసులు చారీ హరీష్​ను స్టేషన్​కు పిలిపించగా.. పెద్దల సమక్షంలో రాజీ కుదుర్చుకున్నారు.

Suicide attempt by a disabled person for police harassment
చారీ హరీష్​ రాసిన లేఖ

ఈనెల 24న రాత్రి పోలీసులు చారీ హరీష్​కు ఫోన్​ చేసి నీపై రౌడీ షీట్​ నమోదు చేస్తున్నామని.. ఆధార్​ కార్డు తీసుకోని రావాలని తెలిపారని చారీ హరీష్​ పేర్కొన్నారు. తనపై అక్రమంగా కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. ఇది తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నాడు.

ఉదయం 11 గంటల సమయంలో ఇంట్లో పురుగుల మందు తాగి... మహబూబూబాద్​కు వెళ్లాలంటూ తన సోదరి కుమారుడి ద్విచక్రవాహనంపై ఎక్కాడు. మార్గమధ్యలో పురుగుల మందు తాగినట్లు ఫోన్​లో కుటుంబ సభ్యులకు తెలపడంతో వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించారు.

ఈ విషయంపై రూరల్​ సీఐ వెంకటరత్నంను వివరణ కోరగా.. లావుఢ్య భద్రు భార్య ఫిర్యాదు మేరకు చారీ హరీష్​ను పోలీస్​స్టేషన్​కు పిలిపించి విచారించాం తప్ప.. ఎలాంటి బెదిరింపులకు గురి చేయలేదని స్పష్టం చేశారు. గతంలోనే ఇతడిపై 354 సెక్షన్​ కింద కేసు నమోదైనట్లు వివరించారు.

ఇదీచూడండి: 'హేమంత్ హత్యోదంతం: 21కి పెరిగిన నిందితుల సంఖ్య'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.