కుటుంబ సభ్యులు మందలించడంతో కీర్తి అనే విద్యార్థిని ఇంటి నుంచి పారిపోయిన సంఘటన హైదరాబాద్లోని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మంగళవారంనాడు ల్యాబ్ పరీక్ష ఉందని చెప్పండంతో కీర్తి సోదరి దీక్షిత ఆమెను బస్స్టాప్లో వదిలివెళ్లిందని పోలీసులు వెల్లడించారు.
హైదరాబాద్లోని బాలాజీ నగర్లో నివాసం ఉంటున్న కీర్తి నగరంలోని బాజిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతోంది. రెండు రోజులుగా ఆమె సోషల్ మీడియాలోనే అధిక సమయం గడుపుతుండడంతో కుటుంబ సభ్యులతో పాటు ఆమె సోదరి దీక్షిత కూడా మందలించింది. అవమానంగా భావించిన కీర్తి ఇంటి నుంచి వెళ్లిపోయింది. సాయంత్రమైనా ఇంటికి చేరుకోకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు బంధువులు, స్నేహితుల ఇళ్లలో వెతికినా ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో జవహర్నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కీర్తి చరవాణి ప్రస్తుతం పని చేస్తున్నట్లు గుర్తించారు.
ఇదీ చదవండి: 7 దశాబ్దాల క్రితం.. పోలీసుల పని తీరు ఎలా ఉండేదో తెలుసా?