హైదరాబాద్ చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్ఆర్ఎల్ కాలనీలో ఉంటున్న మమత అర్థరాత్రి అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. కుటుంబ కలహాలతోనే ఆత్మహత్య చేసుకుందని భర్త చెబుతుండగా.. మృతురాలి బంధువులు అనుమానం వ్యక్తం చేశారు. హత్యచేసి బలవన్మరణంగా నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
![suicide](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-hyd-14-23-suspectedsuicidemahila-av-ts10014_23122020114747_2312f_1608704267_621.jpg)
ఈ మేరకు భర్త కమలాకర్పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: 'నా కూతురిని తీసుకురాకపోతే ఇక్కడే చచ్చిపోతాను'