భూ తగాదాలతో దంపతులపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన వనపర్తి జిల్లా గోపాలపేట మండలం బుద్దారంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన అర్జున్రావు... అనంతరావు అనే వ్యక్తి మధ్యవర్తిత్వంలో కొంత భూమి ఇతరులకు విక్రయించాడు. ఈ క్రమంలో అర్జున్రావుకు తెలియకుండా అనంతరావు 28 గుంటల భూమి కొనుగోలుదారుడికి ఎక్కువగా రిజిస్ట్రేషన్ చేయించాడు. ఈ విషయంలో ఇరువురి మధ్య కొంత కాలంగా వివాదం కొనసాగుతోంది.
తాను పొరపాటు చేశానని, అవసరమైతే తానే స్వయంగా భూమి ఇస్తానని అనంతరావు ఒప్పందపత్రం రాసిచ్చాడు. ఈ రోజు ఉదయం అనంతరావు దంపతులతో గొడవ పడిన అర్జున్రావు... ఇద్దరిపై కత్తితో దాడి చేశాడు. అనంతరావు భార్య రత్నమ్మను తీవ్రంగా గాయపరిచాడు. వెంటనే వనపర్తి ఏరియా ఆసుపత్రికి తరలించగా... పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు హైదరాబాద్కు తీసుకెళ్లాలని సూచించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ సూర్యానాయక్ తెలిపారు.