ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం దెగామలో విషాదం నెలకొంది. ఒకే గ్రామానికి చెందిన ప్రేమజంట పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకుంది. గోడేం శ్రీరాం అక్కడికక్కడే మరణించగా.... యువతి సుజాత రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.
ఒకే కులానికి చెందిన వీరిద్దరి ప్రేమను పెద్దలు అంగీకరించకపోవటం వల్ల ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లుగా స్థానికులు భావిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు ఆరా తీస్తున్నారు.
ఇదీ చదవండి : కరోనా టీకాపై మీ డౌట్స్ ఇవేనా?