ETV Bharat / jagte-raho

పేకాట స్థావరంపై దాడి... ఎనిమిది మంది అరెస్ట్

author img

By

Published : Dec 30, 2020, 12:35 PM IST

జగిత్యాల జిల్లా ధరూర్​ క్యాంపులో పేకాట స్థావరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఎనిమిది మంది పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు... వారి వద్ద నుంచి రూ.36 వేల నగదు, ఏడు చరవాణులను స్వాధీనం చేసుకున్నారు.

jagtial police arrested eight persons in were playing cards in dharur camp
పేకాట స్థావరంపై దాడి... ఎనిమిది మంది అరెస్ట్

గుట్టు చప్పుడు కాకుండా పేకాట నిర్వహిస్తున్న వారిని పోలీసులు దాడులు చేసి పట్టుకున్నారు. జగిత్యాల ధరూర్‌ క్యాంపులో స్థావరాన్ని ఏర్పాటు చేసుకుని కొంతకాలంగా పేకాటను కొనసాగిస్తున్నారు. విశ్వసనీయ సమాచారంతో పేకాట శిబిరంపై జగిత్యాల పట్టణ పోలీసులు దాడి చేశారు.

ఈ దాడుల్లో ఎనిమిది మంది పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకోగా... పేకాటకు సహకరిస్తున్న ఓ ఆర్టీసీ కండక్టర్‌ పరారీలో ఉన్నాడు. వారి వద్ద నుంచి రూ.36 వేల నగదు, ఏడు చరవాణులను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ జయేశ్‌రెడ్డి తెలిపారు.

ఇదీ చూడండి: బ్రహ్మోత్సవాల్లో అపశృతి.. కరెంట్​ షాక్​తో ఉద్యోగి మృతి!

గుట్టు చప్పుడు కాకుండా పేకాట నిర్వహిస్తున్న వారిని పోలీసులు దాడులు చేసి పట్టుకున్నారు. జగిత్యాల ధరూర్‌ క్యాంపులో స్థావరాన్ని ఏర్పాటు చేసుకుని కొంతకాలంగా పేకాటను కొనసాగిస్తున్నారు. విశ్వసనీయ సమాచారంతో పేకాట శిబిరంపై జగిత్యాల పట్టణ పోలీసులు దాడి చేశారు.

ఈ దాడుల్లో ఎనిమిది మంది పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకోగా... పేకాటకు సహకరిస్తున్న ఓ ఆర్టీసీ కండక్టర్‌ పరారీలో ఉన్నాడు. వారి వద్ద నుంచి రూ.36 వేల నగదు, ఏడు చరవాణులను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ జయేశ్‌రెడ్డి తెలిపారు.

ఇదీ చూడండి: బ్రహ్మోత్సవాల్లో అపశృతి.. కరెంట్​ షాక్​తో ఉద్యోగి మృతి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.