అన్నదాత ప్రాణాలు తీసిన అధికారుల నిర్లక్ష్యం
అధికారుల నిర్లక్ష్యం రైతన్న ప్రాణాలను తీసింది. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి గ్రామానికి చెందిన భూమయ్య విరాసత్ చేయాలని సంవత్సరం నుంచి కార్యాలయాల చూట్టూ తిరుగుతున్నా ఫలితం లేకపోయింది. ఆ మనస్థాపంతోనే రైతు మృతి చెందాడు.
అన్నదాత ప్రాణాలు తీసిన అధికారుల నిర్లక్ష్యం
అధికారుల నిర్లక్ష్యం అన్నదాత ప్రాణాలను తీసింది. తండ్రి పేరు మీద ఉన్న ఎకరంన్నర భూమిని తనకు విరాసత్ చేయాలని సంవత్సరం నుంచి రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగాడు భూమయ్య. రోజులు గడుస్తున్నా పని జరగలేదు. దీనికి తోడు ఆరోగ్య సమస్యలు కూడా భూమయ్యను వెంటాడాయి. అధికారుల నిర్లక్ష్యంతోనే రైతుబంధు అందలేదని మనస్థాపం అతని మరణానికి కారణమైంది. విధుల్లో అలసత్వం వహించిన విఆర్ఓ, ఆర్ఐ పై చర్యలు తీసుకొని రైతు కుటుంబానికి పరిహారం వర్తింపచేయాలని, ఇద్దరు కుమార్తెలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు గ్రామస్తులు. భూమయ్య మృతదేహంతో చిగురుమామిడి తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు.
Intro:TG_KRN_101_02_RITHU BANDUVULA_DHARNA_AVB_C11
FROM:KAMALAKAR 9441842417
----------------------------------------------------------------------------
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం నవాబుపేట గ్రామానికి చెందిన ఆకుల భూమయ్య (40) అనే రైతు తన తండ్రి సంవత్సరం క్రితం చనిపోవడంతో తన తండ్రి పేరు మీద ఉన్న ఎకరంన్నర స్థలాన్ని తనకు విరాసత్ చేయాలని సంవత్సరం క్రితం విఆర్ఓ కు దరఖాస్తు చేసుకున్నాడు. సంవత్సరం నుంచి సంబంధిత విఆర్ఓ ఆర్ఐ ఎమ్మార్వో ల ను సంప్రదించిన ఫలితం లేకపోవడంతో నేడు అనారోగ్యంతో చనిపోయాడు. వీఆర్వో నిర్లక్ష్యం కారణంగా బాధిత కుటుంబానికి రైతు బీమా పరిహారం అందకుండా పోయిందని, నిర్లక్ష్యం చేసిన విఆర్ఓ ఆర్ఐ ల పై చర్యలు తీసుకొని భూమయ్య కుటుంబానికి రైతు భీమా వర్తింపచేయాలని, తన ఇద్దరు కుమార్తెలకు న్యాయం చేయాలంటూ భూమయ్య మృతదేహంతో బాధిత రైతు కుటుంబానికి చెందిన బంధువులు చిగురుమామిడి తహిసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేశారు.
Body:బైట్స్
1) రైతు కుటుంబ బంధువు
2) చిగురుమామిడి ఎమ్మార్వో
Conclusion:రైతు మృతదేహంతో బంధువులు తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా
FROM:KAMALAKAR 9441842417
----------------------------------------------------------------------------
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం నవాబుపేట గ్రామానికి చెందిన ఆకుల భూమయ్య (40) అనే రైతు తన తండ్రి సంవత్సరం క్రితం చనిపోవడంతో తన తండ్రి పేరు మీద ఉన్న ఎకరంన్నర స్థలాన్ని తనకు విరాసత్ చేయాలని సంవత్సరం క్రితం విఆర్ఓ కు దరఖాస్తు చేసుకున్నాడు. సంవత్సరం నుంచి సంబంధిత విఆర్ఓ ఆర్ఐ ఎమ్మార్వో ల ను సంప్రదించిన ఫలితం లేకపోవడంతో నేడు అనారోగ్యంతో చనిపోయాడు. వీఆర్వో నిర్లక్ష్యం కారణంగా బాధిత కుటుంబానికి రైతు బీమా పరిహారం అందకుండా పోయిందని, నిర్లక్ష్యం చేసిన విఆర్ఓ ఆర్ఐ ల పై చర్యలు తీసుకొని భూమయ్య కుటుంబానికి రైతు భీమా వర్తింపచేయాలని, తన ఇద్దరు కుమార్తెలకు న్యాయం చేయాలంటూ భూమయ్య మృతదేహంతో బాధిత రైతు కుటుంబానికి చెందిన బంధువులు చిగురుమామిడి తహిసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేశారు.
Body:బైట్స్
1) రైతు కుటుంబ బంధువు
2) చిగురుమామిడి ఎమ్మార్వో
Conclusion:రైతు మృతదేహంతో బంధువులు తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా
TAGGED:
RITHU BANDUVULA DHARNA