నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన పద్మ, రత్నకుమారి, నాగరాణి, ఉమారాణి అనే నలుగురు కలిసి డ్వాక్రా మహిళలతో పీఏసీఎల్ ఇన్సూరెన్స్ కంపెనీలో డబ్బులు కట్టించారు. ఐదు సంవత్సరాలు కట్టిన తర్వాత రెట్టింపు డబ్బు వస్తుందని నమ్మించారు.
ఒక్కొక్కరి నుంచి రూ. 50 వేల నుంచి మూడు లక్షల వరకు కట్టించుకున్నారని బాధిత మహిళలు చెప్పారు. ఈ గ్రామంలో దాదాపు కోటిన్నర వరకు వసూలు చేశారని చెప్పారు. ఇన్సూరెన్స్ డబ్బులు అడిగితే పొంతనలేని సమాధానం చెబుతున్నారని వాపోయారు. తమను మోసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి తరలివచ్చారు. తమ డబ్బులు ఇప్పించాలని కోరారు.
ఇదీ చదవండి: రైతు బీమా నమోదుకు గడువు రెండు రోజులే...