ETV Bharat / jagte-raho

న్యాయం చేయాలంటూ డ్వాక్రా మహిళల నిరసన

తమను మోసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన డ్వాక్రా మహిళలు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి తరలొచ్చారు. ఇన్సూరెన్స్​ పేరుతో లక్షల రూపాయలు చేశారని ఆరోపించారు.

author img

By

Published : Sep 17, 2020, 1:14 PM IST

న్యాయం చేయాలంటూ కలెక్టరేట్​కు వచ్చిన డ్వాక్రా మహిళలు
న్యాయం చేయాలంటూ కలెక్టరేట్​కు వచ్చిన డ్వాక్రా మహిళలు

నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన పద్మ, రత్నకుమారి, నాగరాణి, ఉమారాణి అనే నలుగురు కలిసి డ్వాక్రా మహిళలతో పీఏసీఎల్​ ఇన్సూరెన్స్ కంపెనీలో డబ్బులు కట్టించారు. ఐదు సంవత్సరాలు కట్టిన తర్వాత రెట్టింపు డబ్బు వస్తుందని నమ్మించారు. ​

ఒక్కొక్కరి నుంచి రూ. 50 వేల నుంచి మూడు లక్షల వరకు కట్టించుకున్నారని బాధిత మహిళలు చెప్పారు. ఈ గ్రామంలో దాదాపు కోటిన్నర వరకు వసూలు చేశారని చెప్పారు. ఇన్సూరెన్స్ డబ్బులు అడిగితే పొంతనలేని సమాధానం చెబుతున్నారని వాపోయారు. తమను మోసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి తరలివచ్చారు. తమ డబ్బులు ఇప్పించాలని కోరారు.

నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన పద్మ, రత్నకుమారి, నాగరాణి, ఉమారాణి అనే నలుగురు కలిసి డ్వాక్రా మహిళలతో పీఏసీఎల్​ ఇన్సూరెన్స్ కంపెనీలో డబ్బులు కట్టించారు. ఐదు సంవత్సరాలు కట్టిన తర్వాత రెట్టింపు డబ్బు వస్తుందని నమ్మించారు. ​

ఒక్కొక్కరి నుంచి రూ. 50 వేల నుంచి మూడు లక్షల వరకు కట్టించుకున్నారని బాధిత మహిళలు చెప్పారు. ఈ గ్రామంలో దాదాపు కోటిన్నర వరకు వసూలు చేశారని చెప్పారు. ఇన్సూరెన్స్ డబ్బులు అడిగితే పొంతనలేని సమాధానం చెబుతున్నారని వాపోయారు. తమను మోసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి తరలివచ్చారు. తమ డబ్బులు ఇప్పించాలని కోరారు.

ఇదీ చదవండి: రైతు బీమా నమోదుకు గడువు రెండు రోజులే...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.