క్రికెట్ ఆడుతూ మధ్యలో కిందపడిపోయి క్రీడాకారుడు మృతి చెందిన ఘటన మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. జడ్చర్ల జాతీయ రహదారి పక్కన టైర్ పంచర్ దుకాణం నిర్వహిస్తున్న సాదిక్.. క్రికెట్ ఆటగాడు. జిల్లా కేంద్రంలోని మహబూబ్నగర్ క్రికెట్ అసోసియేషన్ మైదానంలో నిర్వహిస్తున్న టోర్నమెంట్లో జడ్చర్ల జట్టు తరఫున పాల్గొని సాదిక్ బౌలింగ్ చేస్తుండగా మధ్యలో కుప్పకూలిపోయాడు.
వెంటనే అతనికి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. క్రికెట్ ఆడుతూ మృతి చెందడం పట్ల క్రీడాకారుల్లో విషాదం అలుముకుంది. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఇవీ చూడండి: గ్రేటర్పై గెజిట్ నోటిఫికేషన్ కోసం.. భాజపా కార్పొరేటర్ల పోరు