గుర్తు తెలియని దుండగులు నాలుగు విద్యుత్ నియంత్రికల నుంచి ఆయిల్, కాపర్ వైర్లను దొంగిలించిన ఘటన కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలోని ధర్మారం గ్రామం శివారులో జరిగింది. జిల్లాలోని మద్నూర్ బిచ్కుంద పిట్లం జుక్కల్ మండలాల్లో వరుసగా ఈ తరహా చోరీలు ఎక్కువగా జరుగుతున్నాయని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.
కేవలం 15 రోజుల వ్యవధిలో జిల్లాలోని 15 విద్యుత్ నియంత్రికల నుంచి ఆయిల్, కాపర్ వైర్లను చోరీ చేసిన దొంగలు విద్యుత్ శాఖ అధికారులకు తలనొప్పిగా తయారయ్యారు. తమను పట్టుకోండి చూద్దాం అన్నట్లుగా పోలీసులకు సవాలు విసురుతున్నారు.