ETV Bharat / jagte-raho

దైవ దర్శనానికి వెళ్తుండగా కారు బోల్తా.. తల్లీ, కుమారుడి మృతి - నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం వార్తలు

దైవ దర్శనానికి వెళ్తుండగా కారు బోల్తా పడి తల్లీ కొడుకు మృతి చెందారు. ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట వద్ద జరిగింది.

car accident at domalapenta in nagar kurnool, mother and son died
దైవ దర్శనానికి వెళ్తుండగా కారు బోల్తా.. తల్లీ, కొడుకు మృతి
author img

By

Published : Jan 30, 2021, 7:50 PM IST

హైదరాబాద్-శ్రీశైలం ప్రధాన రహదారిపై నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట వద్ద కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తల్లీ కొడుకు మృతి చెందారు. దైవ దర్శనానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళుతున్న కారు.. దోమలపెంట సమీపంలో మలుపు వద్ద అతివేగంగా వచ్చి బోల్తా కొట్టింది. కారులో ఐదుగురు ఉన్నారు. కారు నడుపుతున్న చంద్రశేఖర్.. పక్కనే ముందు సీటులో ఉన్న తల్లి సరస్వతి అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని... మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

మిగిలిన ముగ్గురిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్​కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. అతివేగమే ప్రమాదానికి కారణమని అనుమానిస్తున్నారు.

ఇదీ చూడండి: శబ్ద కాలుష్యంపై పోలీసుల ఆగ్రహం... వాహనాలు సీజ్‌

హైదరాబాద్-శ్రీశైలం ప్రధాన రహదారిపై నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట వద్ద కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తల్లీ కొడుకు మృతి చెందారు. దైవ దర్శనానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళుతున్న కారు.. దోమలపెంట సమీపంలో మలుపు వద్ద అతివేగంగా వచ్చి బోల్తా కొట్టింది. కారులో ఐదుగురు ఉన్నారు. కారు నడుపుతున్న చంద్రశేఖర్.. పక్కనే ముందు సీటులో ఉన్న తల్లి సరస్వతి అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని... మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

మిగిలిన ముగ్గురిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్​కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. అతివేగమే ప్రమాదానికి కారణమని అనుమానిస్తున్నారు.

ఇదీ చూడండి: శబ్ద కాలుష్యంపై పోలీసుల ఆగ్రహం... వాహనాలు సీజ్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.