ములుగు జిల్లా వెంకటాపురం మండలం బొదాపురం వద్ద ఏడు మూగజీవాలు మృత్యువాతపడ్డాయి. పొలంలో ఉన్న వాటికి విద్యుత్ తీగలు తగిలి విద్యుదాఘాతమై అవి మరణించాయి. తమకు జీవనాధారమైన జీవాలు మృతి చెందగా... ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు కోరారు. ప్రభుత్వం ఈ విషయంలో తూతూమంత్రంగా వ్యవహరించకుండా రైతులకు తగిన మొత్తంలో పరిహారం చెల్లించాలని స్థానికులు కోరారు.
ఇవీ చూడండి: రాష్ట్రంలో అనుమతి పొందిన ప్రైవేటు ల్యాబొరేటరీలు ఇవే..