ETV Bharat / jagte-raho

డివైడర్​ను ఢీకొట్టిన బైక్​.. ఒకరి మృతి.. మరొకరికి గాయాలు

author img

By

Published : Jul 4, 2020, 1:59 PM IST

ద్విచక్ర వాహనం అదుపుతప్పి డివైడర్​ను ఢీకొట్టింది. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మహబూబ్​నగర్​ జిల్లాలో చోటుచేసుకుంది.

accident at jadcharla in mahabubnagar district
డివైడర్​ను ఢీకొట్టిన బైక్​.. ఒకరి మృతి.. మరొకరికి గాయాలు

మహబూబ్​నగర్​ జిల్లా జడ్చర్ల సమీపంలో శుక్రవారం రాత్రి రోడ్డుప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనం అదుపుతప్పి డివైడర్​ను ఢీకొట్టింది. ఘటనలో జగదీశ్​ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.

జడ్చర్లకు చెందిన జగదీశ్​, శ్రీకాంత్​లు ద్విచక్ర వాహనంపై మహబూబ్​నగర్ వైపు నుంచి జడ్చర్ల వస్తుండగా.. హౌసింగ్ బోర్డు కాలనీ సమీపంలో డివైడర్​ను ఢీకొట్టారు. ప్రమాదంలో జగదీశ్​ అక్కడికక్కడే మృతి చెందగా.. శ్రీకాంత్​కు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రుడిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మహబూబ్​నగర్​ జిల్లా జడ్చర్ల సమీపంలో శుక్రవారం రాత్రి రోడ్డుప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనం అదుపుతప్పి డివైడర్​ను ఢీకొట్టింది. ఘటనలో జగదీశ్​ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.

జడ్చర్లకు చెందిన జగదీశ్​, శ్రీకాంత్​లు ద్విచక్ర వాహనంపై మహబూబ్​నగర్ వైపు నుంచి జడ్చర్ల వస్తుండగా.. హౌసింగ్ బోర్డు కాలనీ సమీపంలో డివైడర్​ను ఢీకొట్టారు. ప్రమాదంలో జగదీశ్​ అక్కడికక్కడే మృతి చెందగా.. శ్రీకాంత్​కు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రుడిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీచూడండి: విద్యుత్ తీగలు సరిచేస్తుండగా విద్యుదాఘాతంతో రైతు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.