అత్తా కోడళ్ల ఘర్షణ ఓ చిన్నారి ప్రాణం తీసింది. వివరాల్లోకి వెళితే.. మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలం జక్లపల్లికి చెందిన ఓ ఇల్లాలు ఇంట్లో తన అత్తతో గొడవకు దిగింది. అత్తా కోడళ్లు మాటా మాటా అనుకుంటూ.. అత్త చేతిలో ఉన్న తన తొమ్మిది నెలల చిన్నారిని కోడలు కోపంగా తీసుకుని కింద పడేసింది.
దీంతో చిన్నారి స్పృహ తప్పి పడిపోయింది. చికిత్స నిమిత్తం కోస్గిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు తెలిపారు.
చిన్నారి తల్లి మద్యం మత్తులో అత్తతో గొడవ పెట్టుకుని ఈ ఘాతుకానికి పాల్పడినట్లు గ్రామస్థులు పేర్కొన్నారు. చిన్నారిని బలి తీసుకున్న కసాయి తల్లిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: బంజారాహిల్స్లో స్టెరాయిడ్స్.. ఇద్దరు అరెస్టు