ETV Bharat / jagte-raho

350 మంది అధికారుల పేరుతో నకీలీ ఖాతాలు.. ముఠా అరెస్ట్​

వారంతా 20 ఏళ్లలోపు యువకులు.. సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్​గా ఉండే వీరు పోలీసులపై దృష్టి సారించారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 350 మంది అధికారుల పేరుతో నకిలీ ఖాతాలు సృష్టించారు. అంతటితో ఆగలేదు. ఆ ఖాతాలను అడ్డం పెట్టుకుని బెదిరింపులకు, మోసాలకు పాల్పడ్డారు. ఈ నకిలీ ఖాతాల గురించి ఆరా తీసిన పోలీసులు.. రాజస్థాన్​ కేంద్రంగా దందాకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేశారు.

author img

By

Published : Oct 3, 2020, 2:07 PM IST

4 members of Rajasthan young starts
350 మంది అధికారుల పేరుతో నకీలీ ఖాతాలు.. ముఠా అరెస్ట్​

ఐదు రాష్ట్రాలకు చెందిన 350 మంది అధికారుల పేరుతో సామాజిక మాధ్యమాల్లో నకిలీ ఖాతాలు తెరిచి మోసాలకు పాల్పడుతున్న ముఠాను నల్గొండ పోలీసులు అరెస్ట్ చేశారు. రాజస్థాన్‌ కేంద్రంగా ఫేస్‌బుక్‌ నకిలీ ఖాతాలతో దందా సాగిస్తున్న నలుగురు సభ్యుల ముఠాను పోలీసులు నల్గొండకు తీసుకొచ్చి విచారణ ప్రారంభించారు. రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌ జిల్లాకు చెందిన 20 ఏళ్లలోపు ఉన్న ముస్తఖీమ్‌ ఖాన్‌, మనీశ్‌, షాహీద్‌, సద్దాం ఖాన్‌ ఓ ముఠాగా ఏర్పడ్డారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, హరియాణ రాష్ట్రాల పోలీసు అధికారులతో పాటు బ్యాంకు, రైల్వే, సీఆర్‌పీఎఫ్‌ అధికారుల పేరిట నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతాలను సృష్టించారు. డబ్బులు పంపాలని రిక్వెస్టులు పెడుతూ మోసగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరు పోలీసు ఉన్నతాధికారులపైనే ఎక్కువగా ఎందుకు దృష్టి సారించారు, వీరికి ఎవరు సహకరిస్తున్నారు, మోసగించి రాబట్టిన నగదు వారికి ఎలా చేరుతోంది? తదితర కోణాల్లో విచారిస్తున్నామని ఎస్పీ రంగనాథ్​ తెలిపారు.

ఐదు రాష్ట్రాలకు చెందిన 350 మంది అధికారుల పేరుతో సామాజిక మాధ్యమాల్లో నకిలీ ఖాతాలు తెరిచి మోసాలకు పాల్పడుతున్న ముఠాను నల్గొండ పోలీసులు అరెస్ట్ చేశారు. రాజస్థాన్‌ కేంద్రంగా ఫేస్‌బుక్‌ నకిలీ ఖాతాలతో దందా సాగిస్తున్న నలుగురు సభ్యుల ముఠాను పోలీసులు నల్గొండకు తీసుకొచ్చి విచారణ ప్రారంభించారు. రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌ జిల్లాకు చెందిన 20 ఏళ్లలోపు ఉన్న ముస్తఖీమ్‌ ఖాన్‌, మనీశ్‌, షాహీద్‌, సద్దాం ఖాన్‌ ఓ ముఠాగా ఏర్పడ్డారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, హరియాణ రాష్ట్రాల పోలీసు అధికారులతో పాటు బ్యాంకు, రైల్వే, సీఆర్‌పీఎఫ్‌ అధికారుల పేరిట నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతాలను సృష్టించారు. డబ్బులు పంపాలని రిక్వెస్టులు పెడుతూ మోసగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరు పోలీసు ఉన్నతాధికారులపైనే ఎక్కువగా ఎందుకు దృష్టి సారించారు, వీరికి ఎవరు సహకరిస్తున్నారు, మోసగించి రాబట్టిన నగదు వారికి ఎలా చేరుతోంది? తదితర కోణాల్లో విచారిస్తున్నామని ఎస్పీ రంగనాథ్​ తెలిపారు.

ఇవీ చూడండి: తీసుకున్న డబ్బు ఇవ్వట్లేదని తోటి స్నేహితున్ని హతమార్చారు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.