రంగారెడ్డి జిల్లా బాలపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నబీల్కాలనీలో ముగ్గురు వ్యక్తులు రేషన్ బియ్యాన్ని లారీలో తరలిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేసిన ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు.. ముగ్గుర్ని అదుపులోకి తీసుకొన్నారు. వాళ్ల నుంచి ఓ లారీ, మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. విచారణ నిమిత్తం 14.5 టన్నుల బియ్యం, నిందితులను బాలపూర్ పోలీసులకు అప్పగించారు.
ఇదీ చూడండి: షాదీముబారక్ డబ్బులు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు