కరోనా కారణంగా పశ్చిమాసియాలోని పలు దేశాల్లో ఉగ్రముప్పు పెరిగిందని ఐక్యరాజ్యసమితి నిపుణులు తెలిపారు. ఈ మేరకు తమ రిపోర్టును ప్యానెల్ అధికారులకు అందించారు. అఫ్గానిస్థాన్, సిరియా, ఇరాక్ ప్రాంతాల్లో 2020 ద్వితీయార్థంలో ఉగ్రముప్పు అనూహ్యంగా పెరిగిందని పేర్కొన్నారు. ఈ దేశాల్లోని చాలా ప్రాంతాల్లో కరోనా నిబంధనలు సడలించిన నేపథ్యంలో దాడులు జరగవచ్చని హెచ్చరించారు.
ఇరాక్, సిరియాలు ఇస్లామిక్ సంస్థకు ముఖ్యమైన ప్రాంతాలను ప్యానెల్ అభిప్రాయపడింది. అయితే అఫ్గానిస్థాన్పై మాత్రం టెర్రరిస్టులు తీవ్ర ప్రభావం చూపారని నిపుణులు తెలిపారు. గతేడాది ఫిబ్రవరి 29 నుంచి ఇప్పటివరకు దాదాపు 600పైగా అఫ్గాన్ పౌరులు, 2500 మంది భద్రతా బలగాలను ఉగ్రవాదులు హతమార్చారని వివరించారు. అఫ్గాన్లో శాంతి చర్చలు అవసరమని అభిప్రాయపడ్డారు.
దాదాపు 10వేల మంది ఉగ్రవాదులు ఇరాక్, సిరియాలో ఉన్నట్లు ప్యానెల్ అంచనా వేసింది. ఉగ్రవాదులు... తమ కార్యకలాపాలను వెస్ట్ ఆఫ్రికాకు సైతం విస్తరించారని పేర్కొంది.
ఇదీ చదవండి : తాలిబన్ల దాడిలో 26 మంది భద్రతా సిబ్బంది మృతి