ETV Bharat / international

యూఏఈలో మెగా జాక్​పాట్ కొట్టిన భారతీయులు

అబుదబిలో ముగ్గురు భారతీయులను అదృష్టం వరించింది. యూఏఈలో నిర్వహించే నెలవారీ లాటరీలో కారు డ్రైవర్లు 5 మిలియన్ల డాలర్ల నగదును గెలుచుకున్నారు.

author img

By

Published : Apr 6, 2020, 2:46 PM IST

dubai lottery
యూఏఈలో మెగా జాక్​పాట్ గెలిచిన ప్రవాసులు

యూఏఈలోని అబుదబిలో నిర్వహించే నెలవారీ లాటరీలో ముగ్గురు భారతీయులు 5 మిలియన్ డాలర్ల జాక్​పాట్​ కొట్టారు.

బిగ్​ టికెట్ రాఫెల్​ డ్రాలో కేరళ కన్నూర్​ జిల్లాకు చెందిన జిజేశ్​ కొరోతన్​ 20 మిలియన్​ దిర్హమ్​(5 మిలియన్​ డాలర్లు)ను కైవసం చేసుకున్నారని గల్ఫ్​ మీడియా తెలిపింది. ఈయన 15 ఏళ్లగా రస్​ అల్​ ఖైమాలో నివసిస్తూ డ్రైవర్​గా పనిచేస్తున్నారు. ఈయనతో పాటు లాటరీ గెలిచిన మరో ఇద్దరూ డ్రైవర్లే.

"ఈ నెల ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా. కనీసం పని కూడా దొరకలేదు. కుటుంబాన్ని పోషించడానికి చాలా ఇబ్బంది పడుతున్నా. ఇలాంటి పరిస్థితుల్లో ఈ లక్కీ డ్రా నాకు ఓ కొండంత అండగా నిలిచింది. ప్రస్తుతం గెలుచుకున్న ఈ నగదును ఏడో తరగతి చదువుతున్న నా కూతురి ఉన్నత చదువులకు, నేను నా స్నేహితులు కలిసి ప్రారంభించిన కారుల వ్యాపారానికి ఉపయోగిస్తా.

-- జిజేశ్​ కొరోతన్​, జాక్​పాట్​ విజేత

కొవిడ్​-19 నివారణలో భాగంగా ప్రజలు లేకుండానే ఈ ఫేస్​బుక్​, యూట్యూబ్​లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా లాటరీ విజేతలను ప్రకటించారు.

ఇదీ చదవండి: పాక్​కు 'అండర్​వేర్​ మాస్కులు' పంపిన చైనా

యూఏఈలోని అబుదబిలో నిర్వహించే నెలవారీ లాటరీలో ముగ్గురు భారతీయులు 5 మిలియన్ డాలర్ల జాక్​పాట్​ కొట్టారు.

బిగ్​ టికెట్ రాఫెల్​ డ్రాలో కేరళ కన్నూర్​ జిల్లాకు చెందిన జిజేశ్​ కొరోతన్​ 20 మిలియన్​ దిర్హమ్​(5 మిలియన్​ డాలర్లు)ను కైవసం చేసుకున్నారని గల్ఫ్​ మీడియా తెలిపింది. ఈయన 15 ఏళ్లగా రస్​ అల్​ ఖైమాలో నివసిస్తూ డ్రైవర్​గా పనిచేస్తున్నారు. ఈయనతో పాటు లాటరీ గెలిచిన మరో ఇద్దరూ డ్రైవర్లే.

"ఈ నెల ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా. కనీసం పని కూడా దొరకలేదు. కుటుంబాన్ని పోషించడానికి చాలా ఇబ్బంది పడుతున్నా. ఇలాంటి పరిస్థితుల్లో ఈ లక్కీ డ్రా నాకు ఓ కొండంత అండగా నిలిచింది. ప్రస్తుతం గెలుచుకున్న ఈ నగదును ఏడో తరగతి చదువుతున్న నా కూతురి ఉన్నత చదువులకు, నేను నా స్నేహితులు కలిసి ప్రారంభించిన కారుల వ్యాపారానికి ఉపయోగిస్తా.

-- జిజేశ్​ కొరోతన్​, జాక్​పాట్​ విజేత

కొవిడ్​-19 నివారణలో భాగంగా ప్రజలు లేకుండానే ఈ ఫేస్​బుక్​, యూట్యూబ్​లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా లాటరీ విజేతలను ప్రకటించారు.

ఇదీ చదవండి: పాక్​కు 'అండర్​వేర్​ మాస్కులు' పంపిన చైనా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.