ప్రపంచవ్యాప్తంగా గడిచిన వారంలో 20 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) తెలిపింది. వైరస్ వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి స్వల్పకాలంలో భారీ సంఖ్యలో కేసులు నమోదవడం గమనార్హం. అత్యధికంగా ఐరోపా 13 లక్షల పైగా కొవిడ్ కేసులు బయటపడగా... ఇవి ప్రపంచంలో నమోదైన మొత్తం కేసుల్లో 46 శాతమని అధికారులు తెలిపారు.
అత్యధిక వైరస్ మరణాలు కూడా ఐరోపాలోనే వెలుగుచూస్తున్నాయని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. గత వారంతో పోల్చుకుంటే 35శాతం కొవిడ్ మరణాలు పెరిగినట్లు వెల్లడించింది. అయితే తొలిదశతో పోల్చుకుంటే కరోనా మరణాలు పాక్షికంగా తగ్గాయని పేర్కొంది.
ఐరోపాలోని 21 దేశాల్లో కొవిడ్ కారణంగా ఆసుపత్రుల, ఐసీయూల ఆక్యుపెన్సీ పెరిగిందని డబ్ల్యూహెచ్ఓ గుర్తించింది. కరోనాతో 18శాతం మంది ఆసుపత్రి పాలవగా... 7శాతం మందికి వెంటిలేటర్ల సాయంతో చికిత్స పొందుతున్నారని తెలిపింది.
గడిచిన మూడు వారాలుగా భారత్, అమెరికా, ఫ్రాన్స్, బ్రెజిల్, బ్రిటన్లో అత్యధికం వైరస్ కేసులు వెలుగుచూస్తున్నాయని పేర్కొంది.
ఇదీ చూడండి: భారత్తో సరిహద్దు సమస్య ద్వైపాక్షిక అంశం: చైనా