కరోనా మూలాలను కనుగొనేందుకు చైనాలో పర్యటిస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) నిపుణుల బృందం.. పరిశోధనను ముమ్మరం చేసింది. వైరస్ వ్యాప్తికి మూల కేంద్రంగా భావిస్తున్న వుహాన్లోని అతిపెద్ద మాంసాహార మార్కెట్ను ఆదివారం సందర్శించింది. డబ్ల్యూహెచ్ఓ బృందంతో పాటు పెద్ద సంఖ్యలో చైనా అధికారులు, ప్రతినిధులు మార్కెట్ సందర్శనకు హాజరయ్యారు.
తొలిదశలో కరోనా కేసులు నమోదైన వుహాన్లోని జిన్యాన్టాన్ ఆసుపత్రిని, హుబెయ్లోని చైనీస్, వెస్టర్న్ మెడిసిన్ ఆసుపత్రిని ఇప్పటికే ఈ బృందం సందర్శించింది. ఓ మ్యూజియంలోనూ శనివారం పర్యటించింది. ఇటీవలే 14రోజుల క్వారంటైన్ పూర్తి చేసుకున్న ఈ బృందం.. క్షేత్రస్థాయి పరిశోధనను చేపట్టింది.
హునాన్లోని సీఫుడ్ మార్కెట్ సహా, వుహాన్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ప్రయోగశాలను కూడా ఈ బృందం సందర్శించనుందని డబ్ల్యూహెచ్ఓ గత వారం ట్విట్టర్ వేదికగా తెలిపింది. వైరస్ తమ దేశంలో పుట్టలేదని చైనా వాదిస్తున్న తరుణంలో డబ్ల్యూహెచ్ఓ పర్యటనపై రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇదీ చదవండి:డబ్ల్యూహెచ్ఓ పర్యటనతో చైనా కరోనా గుట్టు వీడుతుందా?