ETV Bharat / international

'తక్షణమే సూకీ ప్రభుత్వాన్ని పునరుద్ధరించాలి' - ఆసియా నేతలను సంప్రదించనున్న గుటెరస్

మయన్మార్​లో ఆంగ్​ సాన్ సూకీ ప్రభుత్వాన్ని వెంటనే పునరుద్ధరించాలని అమెరికా డిమాండ్ చేసింది. సైనిక తిరుగుబాటు ఇలాగే కొనసాగిస్తే తాము తీసుకొవాల్సిన చర్యలేమిటనే అంశంపై పరిశీలిస్తున్నట్లు అమెరికా విదేశాంగ ప్రతినిధి నెడ్ ప్రైస్ తెలిపారు. మరోవైపు మయన్మార్​ సైనిక చర్యపై... ఆసియా దేశాల నేతలతో సంప్రదించేందుకు ఐరాస చీఫ్ ఆంటోనియో గుటెరస్ సిద్ధమవుతున్నారు.

US expresses concern over Myanmar
సూకీ ప్రభుత్వాన్ని పునరుద్ధరించాలంటూ అమెరికా డిమాండ్
author img

By

Published : Feb 9, 2021, 11:03 AM IST

మయన్మార్​లో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని వెంటనే పునరుద్ధరించాలని, ఆ దేశ సైన్యాన్ని అమెరికా డిమాండ్ చేసింది. సైన్యం నిరంకుశత్వాన్ని ఇలాగే కొనసాగిస్తే తీసుకోవాల్సిన చర్యలను నిశితంగా పరిశీలిస్తున్నామని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్ ప్రైస్ తెలిపారు. మయన్మార్ ప్రజాస్వామ్య ప్రభుత్వానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మయన్మార్​లో తమ హక్కుల పరిరక్షణకు శాంతియుత ఆందోళన చేసే వారికి మద్దతు ఇస్తామని ప్రైస్ వెల్లడించారు.

మయన్మార్​లో బహిరంగ సభలను పరిమితం చేస్తూ సైన్యం తీసుకున్న నిర్ణయంపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. శాంతియుత నిరసనలు, భావ ప్రకటనా స్వేచ్ఛ కోసం జరిగే ఆందోళనలకు అగ్రరాజ్యం అండగా ఉంటుందని స్పష్టం చేసింది.

ఆసియా నేతలతో...

మయన్మార్​ సైనిక తిరుగుబాటుపై ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెరస్ ఆసియా దేశాల నేతలతో సంప్రదించనున్నట్లు ఐరాస ప్రతినిధి తెలిపారు. ప్రస్తుతం మయన్మార్​లోని పరిస్థితులను గుటెరస్ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారని అన్నారు. మయన్మార్​లో ప్రజాస్వామ్య ప్రభుత్వం పునరుద్ధరణకు మద్దతుగా ప్రపంచ దేశాలు ద్వైపాక్షిక చర్చలు చేపట్టాలని కోరనున్నట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి:'ఎన్నికలు జరిపి విజేతలకు పట్టం కడతాం'

మయన్మార్​లో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని వెంటనే పునరుద్ధరించాలని, ఆ దేశ సైన్యాన్ని అమెరికా డిమాండ్ చేసింది. సైన్యం నిరంకుశత్వాన్ని ఇలాగే కొనసాగిస్తే తీసుకోవాల్సిన చర్యలను నిశితంగా పరిశీలిస్తున్నామని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్ ప్రైస్ తెలిపారు. మయన్మార్ ప్రజాస్వామ్య ప్రభుత్వానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మయన్మార్​లో తమ హక్కుల పరిరక్షణకు శాంతియుత ఆందోళన చేసే వారికి మద్దతు ఇస్తామని ప్రైస్ వెల్లడించారు.

మయన్మార్​లో బహిరంగ సభలను పరిమితం చేస్తూ సైన్యం తీసుకున్న నిర్ణయంపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. శాంతియుత నిరసనలు, భావ ప్రకటనా స్వేచ్ఛ కోసం జరిగే ఆందోళనలకు అగ్రరాజ్యం అండగా ఉంటుందని స్పష్టం చేసింది.

ఆసియా నేతలతో...

మయన్మార్​ సైనిక తిరుగుబాటుపై ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెరస్ ఆసియా దేశాల నేతలతో సంప్రదించనున్నట్లు ఐరాస ప్రతినిధి తెలిపారు. ప్రస్తుతం మయన్మార్​లోని పరిస్థితులను గుటెరస్ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారని అన్నారు. మయన్మార్​లో ప్రజాస్వామ్య ప్రభుత్వం పునరుద్ధరణకు మద్దతుగా ప్రపంచ దేశాలు ద్వైపాక్షిక చర్చలు చేపట్టాలని కోరనున్నట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి:'ఎన్నికలు జరిపి విజేతలకు పట్టం కడతాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.