ETV Bharat / international

'ప్రపంచాన్ని ఏకం చేసి సైనిక చర్యను తిప్పికొడతాం!'

author img

By

Published : Feb 6, 2021, 10:19 AM IST

మయన్మార్​లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించేందుకు ఏదైనా చేస్తామని ఐరాస చీఫ్ ఆంటోనియో గుటెరస్ తేల్చిచెప్పారు. నిర్బంధంలో ఉంచిన నేతలందరినీ విడిచిపెట్టాలని సైన్యానికి సూచించారు. ఐరాస ప్రతినిధితో తొలిసారి ఆ దేశ సైన్యం సంప్రదింపులు జరిపిందని చెప్పారు. మరోవైపు, ట్విట్టర్, ఇన్​స్టాగ్రామ్​లపై మయన్మార్ సైన్యం నిషేధం విధించింది.

UN chief: UN will seek to unite world, reverse Myanmar coup
'ప్రపంచాన్ని ఏకం చేసి సైనిక చర్యను తిప్పికొడతాం!'

అంతర్జాతీయ సమాజాన్ని ఏకం చేసి, మయన్మార్​లో సైనిక తిరుగుబాటును తిప్పికొట్టేందుకు ఐరాస ఏదైనా చేస్తుందని ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ స్పష్టం చేశారు. మయన్మార్​లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలన్న భద్రతా మండలి పిలుపును అమలు చేయడం అత్యంత ఆవశ్యకమని పేర్కొన్నారు. నవంబర్​లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల ఫలితాలను గౌరవించి.. నిర్బంధంలో ఉంచిన నేతలందరినీ విడుదల చేయాలని సైన్యానికి హితవు పలికారు.

తొలిసారి..

మయన్మార్​ ఐరాస ప్రత్యేక ప్రతినిధి క్రిస్టీన్ ష్రానర్ బర్గెనర్​తో శుక్రవారం ఆ దేశ సైన్యం తొలిసారి సంప్రదింపులు జరిపిందని గుటెరస్ ప్రతినిధి స్టీఫెన్ డుజరిక్ తెలిపారు. సైనిక చర్యను ఐరాస తీవ్రంగా ఖండించినట్లు మయన్మార్ కమాండర్ ఇన్ ఛీఫ్​ సో విన్​కు స్పష్టం చేసినట్లు వెల్లడించారు.

"నిర్బంధంలో ఉంచినవారిని వెంటనే విడుదల చేయాలని ష్రానర్ బర్గెనర్ ఆ దేశ సైనికాధికారులకు స్పష్టం చేశారు. రోహింగ్యా శరణార్థులు తిరిగి స్వదేశానికి చేరుకునే ప్రక్రియ పురోగతి సాధించాలని, ఇందుకోసం ముఖ్యమైన చర్చలు ప్రారంభించాలని పేర్కొన్నారు."

-స్టీఫెన్ డుజరిక్, గుటెరస్ ప్రతినిధి

ఆసియాన్ దేశాలతోనూ ష్రానర్ సంప్రదింపులు జరుపుతున్నారని ఐరాస చీఫ్ గుటెరస్ తెలిపారు. మరోవైపు, ప్రపంచ శాంతి పరిరక్షణకు పాటుపడే భద్రతా మండలిలోని 15 సభ్య దేశాలతో ఐరాస చర్చలు జరుపుతోందని చెప్పారు.

ట్విట్టర్, ఇన్​స్టాపైనా వేటు

సమాచార వ్యవస్థపై మయన్మార్ సైన్యం ఉక్కుపాదం మోపుతోంది. ప్రజా ప్రయోజనాల రీత్యా ఫేస్​బుక్​పై నిషేధం విధించినట్లు ప్రకటించిన సైన్యం.. ట్విట్టర్, ఇన్​స్టాగ్రామ్ సేవలనూ నిలిపివేసింది. ఈ మేరకు ఆ దేశంలో ఇంటర్నెట్ సేవలను అందించే టెలినార్ ప్రకటనను సీఎన్ఎన్ ప్రస్తావించింది. ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలు మయన్మార్ చట్టాలకు లోబడే ఉన్నప్పటికీ.. అంతర్జాతీయ మానవహక్కులను ఇవి ఉల్లంఘిస్తున్నాయని టెలినార్ పేర్కొంది.

మరోవైపు, ఈ ఆదేశాలపై తీవ్రంగా ఆందోళన చెందుతున్నట్లు ట్విట్టర్ తెలిపింది. తమ గళాన్ని వినిపించాలనుకునే ప్రజల హక్కులకు ఈ ఉత్తర్వులు విఘాతం కలిగిస్తాయని తెలిపింది. ఇన్​స్టాగ్రామ్​పై విధించిన నిషేధాన్ని వెంటనే ఎత్తివేయాలని ఫేస్​బుక్ కోరింది.

సంబంధిత కథనాలు:

అంతర్జాతీయ సమాజాన్ని ఏకం చేసి, మయన్మార్​లో సైనిక తిరుగుబాటును తిప్పికొట్టేందుకు ఐరాస ఏదైనా చేస్తుందని ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ స్పష్టం చేశారు. మయన్మార్​లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలన్న భద్రతా మండలి పిలుపును అమలు చేయడం అత్యంత ఆవశ్యకమని పేర్కొన్నారు. నవంబర్​లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల ఫలితాలను గౌరవించి.. నిర్బంధంలో ఉంచిన నేతలందరినీ విడుదల చేయాలని సైన్యానికి హితవు పలికారు.

తొలిసారి..

మయన్మార్​ ఐరాస ప్రత్యేక ప్రతినిధి క్రిస్టీన్ ష్రానర్ బర్గెనర్​తో శుక్రవారం ఆ దేశ సైన్యం తొలిసారి సంప్రదింపులు జరిపిందని గుటెరస్ ప్రతినిధి స్టీఫెన్ డుజరిక్ తెలిపారు. సైనిక చర్యను ఐరాస తీవ్రంగా ఖండించినట్లు మయన్మార్ కమాండర్ ఇన్ ఛీఫ్​ సో విన్​కు స్పష్టం చేసినట్లు వెల్లడించారు.

"నిర్బంధంలో ఉంచినవారిని వెంటనే విడుదల చేయాలని ష్రానర్ బర్గెనర్ ఆ దేశ సైనికాధికారులకు స్పష్టం చేశారు. రోహింగ్యా శరణార్థులు తిరిగి స్వదేశానికి చేరుకునే ప్రక్రియ పురోగతి సాధించాలని, ఇందుకోసం ముఖ్యమైన చర్చలు ప్రారంభించాలని పేర్కొన్నారు."

-స్టీఫెన్ డుజరిక్, గుటెరస్ ప్రతినిధి

ఆసియాన్ దేశాలతోనూ ష్రానర్ సంప్రదింపులు జరుపుతున్నారని ఐరాస చీఫ్ గుటెరస్ తెలిపారు. మరోవైపు, ప్రపంచ శాంతి పరిరక్షణకు పాటుపడే భద్రతా మండలిలోని 15 సభ్య దేశాలతో ఐరాస చర్చలు జరుపుతోందని చెప్పారు.

ట్విట్టర్, ఇన్​స్టాపైనా వేటు

సమాచార వ్యవస్థపై మయన్మార్ సైన్యం ఉక్కుపాదం మోపుతోంది. ప్రజా ప్రయోజనాల రీత్యా ఫేస్​బుక్​పై నిషేధం విధించినట్లు ప్రకటించిన సైన్యం.. ట్విట్టర్, ఇన్​స్టాగ్రామ్ సేవలనూ నిలిపివేసింది. ఈ మేరకు ఆ దేశంలో ఇంటర్నెట్ సేవలను అందించే టెలినార్ ప్రకటనను సీఎన్ఎన్ ప్రస్తావించింది. ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలు మయన్మార్ చట్టాలకు లోబడే ఉన్నప్పటికీ.. అంతర్జాతీయ మానవహక్కులను ఇవి ఉల్లంఘిస్తున్నాయని టెలినార్ పేర్కొంది.

మరోవైపు, ఈ ఆదేశాలపై తీవ్రంగా ఆందోళన చెందుతున్నట్లు ట్విట్టర్ తెలిపింది. తమ గళాన్ని వినిపించాలనుకునే ప్రజల హక్కులకు ఈ ఉత్తర్వులు విఘాతం కలిగిస్తాయని తెలిపింది. ఇన్​స్టాగ్రామ్​పై విధించిన నిషేధాన్ని వెంటనే ఎత్తివేయాలని ఫేస్​బుక్ కోరింది.

సంబంధిత కథనాలు:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.