ETV Bharat / international

North Korea: అణ్వాయుధాల ఫ్యాక్టరీని మళ్లీ తెరిచిన కిమ్!

author img

By

Published : Aug 30, 2021, 11:04 AM IST

అణ్వాయుధాల విషయంలో(Nuclear Weapons) అమెరికాతో బెదిరింపులకు దిగుతున్న ఉత్తరకొరియా(North Korea) మరో అడుగు ముందుకేసినట్లు కనిపిస్తోంది. యోంగ్​బ్యోన్​లోని న్యూక్లియర్​ రియాక్టర్​ కేంద్రాన్ని తిరిగి ప్రారంభించినట్లు కనిపిస్తోందని ఐరాస అణువిభాగం తెలిపింది.

kim jong-un
ఉత్తర కొరియా, కిమ్​ జోంగ్ ఉన్

అణుకార్యకలాపాల విషయంలో ఉత్తర కొరియా(North Korea) మళ్లీ దూకుడు వైఖరిని ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది. అణ్వాయుధాలకు తయారీలో కీలకమైన ఓ న్యూక్లియర్​ రియాక్టర్ కేంద్రాన్ని తిరిగి ప్రారంభించినట్లు కనిపిస్తోందని ఐరాస అణు విభాగం ఆందోళన వ్యక్తం చేసింది. అణుకార్యక్రమాల విషయంలో అమెరికాకు బహిరంగ బెదిరింపులకు దిగుతున్న క్రమంలో కిమ్​ జోంగ్​ ఉన్(Kim jong-un)​ ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టడం గమనార్హం.

యోంగ్​బ్యోన్​లోని 5 మెగా వాట్ల న్యూక్లియర్​ రియాక్టర్​ను ప్రారంభించినట్లు ఇంటర్నేషనల్​ అటామిక్​ ఎనర్జీ ఏజెన్సీ(ఐఏఈఏ) తన వార్షిక నివేదికలో తెలిపింది. చాలా రోజుల నుంచి ఈ మేరకు సూచనలు కనిపించాయని పేర్కొంది. ఉపగ్రహ చిత్రాలు, విశ్వసనీయ వర్గాల సమాచారం ఆధారంగా ఈ విషయం తమకు తెలిసిందని ఐఏఈఏ పేర్కొంది.

"ఫిబ్రవరి నుంచి జులై మధ్య యోంగ్​బ్యోన్​లోని రేడియోకెమికల్ లేబరేటరీని ఉత్తర కొరియా తిరిగి ప్రారంభిస్తోందనే సూచనలు కనిపించాయి. చాలా రోజుల నుంచి ఈ ప్రాంతంలో వాహనాలు సంచరించడం వంటివి కనిపించాయి. ఉత్తర కొరియా అణుకార్యకలపాలు తీవ్ర ఆందోళనకు కారణమవుతున్నాయి."

-ఐఏఈఏ

యోంగ్​బ్యోన్​లోని అణుకేంద్రంలో అణ్వాయుధాల తయారీలో ఉపయోగించే కీలకమైన ప్లుటోనియం ఉత్పత్తి జరగుతోందని సమాచారం. మరోవైపు.. అణ్వాయుధాల కార్యకలాపాల వ్యవహారంలో ఉత్తరకొరియా, అమెరికా మధ్య చర్చలు రెండున్నరేళ్లుగా స్తంభించాయి. అణ్వాయుధాల కార్యకలాపాల్లో అమెరికా విధించిన ఆంక్షలను సడలించకుంటే.. యుద్ధసామగ్రిని పెంచుకుంటామని ఇదివరకే హెచ్చరించారు ఉత్తకొరియా అధ్యక్షుడు కిమ్.

ఇవీ చూడండి:

అణుకార్యకలాపాల విషయంలో ఉత్తర కొరియా(North Korea) మళ్లీ దూకుడు వైఖరిని ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది. అణ్వాయుధాలకు తయారీలో కీలకమైన ఓ న్యూక్లియర్​ రియాక్టర్ కేంద్రాన్ని తిరిగి ప్రారంభించినట్లు కనిపిస్తోందని ఐరాస అణు విభాగం ఆందోళన వ్యక్తం చేసింది. అణుకార్యక్రమాల విషయంలో అమెరికాకు బహిరంగ బెదిరింపులకు దిగుతున్న క్రమంలో కిమ్​ జోంగ్​ ఉన్(Kim jong-un)​ ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టడం గమనార్హం.

యోంగ్​బ్యోన్​లోని 5 మెగా వాట్ల న్యూక్లియర్​ రియాక్టర్​ను ప్రారంభించినట్లు ఇంటర్నేషనల్​ అటామిక్​ ఎనర్జీ ఏజెన్సీ(ఐఏఈఏ) తన వార్షిక నివేదికలో తెలిపింది. చాలా రోజుల నుంచి ఈ మేరకు సూచనలు కనిపించాయని పేర్కొంది. ఉపగ్రహ చిత్రాలు, విశ్వసనీయ వర్గాల సమాచారం ఆధారంగా ఈ విషయం తమకు తెలిసిందని ఐఏఈఏ పేర్కొంది.

"ఫిబ్రవరి నుంచి జులై మధ్య యోంగ్​బ్యోన్​లోని రేడియోకెమికల్ లేబరేటరీని ఉత్తర కొరియా తిరిగి ప్రారంభిస్తోందనే సూచనలు కనిపించాయి. చాలా రోజుల నుంచి ఈ ప్రాంతంలో వాహనాలు సంచరించడం వంటివి కనిపించాయి. ఉత్తర కొరియా అణుకార్యకలపాలు తీవ్ర ఆందోళనకు కారణమవుతున్నాయి."

-ఐఏఈఏ

యోంగ్​బ్యోన్​లోని అణుకేంద్రంలో అణ్వాయుధాల తయారీలో ఉపయోగించే కీలకమైన ప్లుటోనియం ఉత్పత్తి జరగుతోందని సమాచారం. మరోవైపు.. అణ్వాయుధాల కార్యకలాపాల వ్యవహారంలో ఉత్తరకొరియా, అమెరికా మధ్య చర్చలు రెండున్నరేళ్లుగా స్తంభించాయి. అణ్వాయుధాల కార్యకలాపాల్లో అమెరికా విధించిన ఆంక్షలను సడలించకుంటే.. యుద్ధసామగ్రిని పెంచుకుంటామని ఇదివరకే హెచ్చరించారు ఉత్తకొరియా అధ్యక్షుడు కిమ్.

ఇవీ చూడండి:

'కొరియా బోర్డర్ దాటితే కాల్చేస్తారా? నిజమెంత?'

యుద్ధానికి సిద్ధం కండి: కిమ్ ఆదేశం

అమెరికాతో పోరుకు సై అంటున్న కిమ్​!

బైడెన్​కు కిమ్​ సర్కార్​ తీవ్ర హెచ్చరిక

దక్షిణ కొరియాపై కిమ్​ ప్రభుత్వం క్షిపణి దాడులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.