హాంకాంగ్లో మాస్క్లపై నిషేధం విధించటం పట్ల ఆందోళనకారులు వినూత్న నిరసన చేపట్టారు. నల్ల దుస్తులు, ముఖానికి మాస్క్లతో ఓ భారీ మానవహారం నిర్వహించారు. ర్యాలీ నేపథ్యంలో ముందస్తు చర్యగా హాంకాంగ్లోని సబ్వే స్టేషన్లను అధికారులు మూసివేశారు.
కొద్దికాలంగా నిరసనకారులు వందల సంఖ్యలో సబ్వే స్టేషన్లను, దుకాణాలను, రోడ్లను నిలిపివేయటం వల్ల హాంకాంగ్ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైంది. అత్యవసరంగా మాస్క్ వాడకంపై నిషేధం విధించటాన్ని నిరసనకారులు తప్పుపట్టారు. 1967 చట్టం ప్రకారం అత్యవసర సమయాల్లో ఏదైనా నిర్ణయం తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉందని అధికారులు తెలిపారు. నిషేధ నిర్ణయాన్ని బీజింగ్, ప్రభుత్వ మద్దతుదారులు స్వాగతించారు.
అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని కొంతమంది చట్టసభ్యులు వ్యతిరేకిస్తున్నారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడం మంచిదికాదని హితవు పలికారు. ఇలా చేస్తే నిరసనలు మరింత ఉద్ధృతం అవుతాయని హెచ్చరించారు. గత నాలుగు నెలలుగా చైనా నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు హాంకాంగ్ వాసులు.
ఇదీ చూడండి:హరియాణా: జాతీయ పార్టీలకు అసమ్మతి చిక్కులు