ETV Bharat / international

కృష్ణాష్టమి నాడే పాక్​లో హిందూ ఆలయం ధ్వంసం

author img

By

Published : Aug 31, 2021, 10:36 AM IST

Updated : Aug 31, 2021, 2:02 PM IST

పాకిస్థాన్​లో మరో హిందూ ఆలయాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారు. సింధ్​ జిల్లా సంఘర్​ జిల్లా ఖిప్రోలో ఈ ఘటన జరిగింది.

Hindu temple vandalised in Pak's Sindh province
కృష్ణాష్టమి నాడే పాక్​లో హిందూ ఆలయం ధ్వంసం

పాకిస్థాన్​లో హిందూ ఆలయాలపై దాడులు కొనసాగుతున్నాయి. సింధ్ రాష్ట్రం సంఘార్​ జిల్లా ఖిప్రోలోని ఓ గుడిని కొందరు దుండగులు ధ్వంసం చేశారు.

రాహత్​ జాన్ ఆస్టిన్​ అనే హక్కుల కార్యకర్త ఈ విషయం ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. "హిందువులు కృష్ణాష్టమి జరుపుకుంటున్న వేళ వారి దేవుడ్ని అవమానించేలా ఖిప్రోలో ఓ ఆలయాన్ని ధ్వంసం చేశారు. పాకిస్థాన్​లో ఇస్లాంను దూషించారన్న అసత్య ఆరోపణలు వస్తేనే.. మూకదాడి చేసి చంపుతారు. లేదా మరణశిక్ష విధిస్తారు. కానీ.. ఇతర మతాల దేవుళ్ల విషయంలో జరిగే దాడులను మాత్రం పట్టించుకోరు" అని పోస్ట్ చేశారు జాన్ ఆస్టిన్.

Hindu temple vandalised in Pak's Sindh province
హిందూ ఆలయం ధ్వంసం

రాహత్ జాన్​ ఆస్టిన్... పాకిస్థాన్​లో పుట్టిన క్రైస్తవుడు. ఆ దేశంలోని మైనారిటీల కోసం ఎప్పుడూ గళం వినిపిస్తుంటారు. దాడులకు భయపడి పాకిస్థాన్​ వదిలి పారిపోయి, ప్రస్తుతం కుటుంబంతో కలిసి దక్షిణ కొరియాలో నివసిస్తున్నారు.

వరుస దాడులు

పాకిస్థాన్​లో హిందూ ఆలయాలపై దాడులు ఇటీవల ఎక్కువయ్యాయి. కొద్దిరోజుల క్రితమే కొందరు రహీమ్​ యార్​ ఖాన్​ జిల్లాలోని భోంగ్​ గ్రామంలోని గుడిని కొందరు ధ్వంసం చేశారు.

ఆలయాలపై దాడుల విషయంలో భారత్​ ఎప్పటికప్పుడు పాకిస్థాన్​ ప్రభుత్వానికి తన అసంతృప్తిని తెలియజేస్తోంది.

ఇదీ చూడండి: మలేసియాలో రాజకీయ అస్థిరత.. ఆజ్యం పోస్తున్న కరోనా

పాకిస్థాన్​లో హిందూ ఆలయాలపై దాడులు కొనసాగుతున్నాయి. సింధ్ రాష్ట్రం సంఘార్​ జిల్లా ఖిప్రోలోని ఓ గుడిని కొందరు దుండగులు ధ్వంసం చేశారు.

రాహత్​ జాన్ ఆస్టిన్​ అనే హక్కుల కార్యకర్త ఈ విషయం ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. "హిందువులు కృష్ణాష్టమి జరుపుకుంటున్న వేళ వారి దేవుడ్ని అవమానించేలా ఖిప్రోలో ఓ ఆలయాన్ని ధ్వంసం చేశారు. పాకిస్థాన్​లో ఇస్లాంను దూషించారన్న అసత్య ఆరోపణలు వస్తేనే.. మూకదాడి చేసి చంపుతారు. లేదా మరణశిక్ష విధిస్తారు. కానీ.. ఇతర మతాల దేవుళ్ల విషయంలో జరిగే దాడులను మాత్రం పట్టించుకోరు" అని పోస్ట్ చేశారు జాన్ ఆస్టిన్.

Hindu temple vandalised in Pak's Sindh province
హిందూ ఆలయం ధ్వంసం

రాహత్ జాన్​ ఆస్టిన్... పాకిస్థాన్​లో పుట్టిన క్రైస్తవుడు. ఆ దేశంలోని మైనారిటీల కోసం ఎప్పుడూ గళం వినిపిస్తుంటారు. దాడులకు భయపడి పాకిస్థాన్​ వదిలి పారిపోయి, ప్రస్తుతం కుటుంబంతో కలిసి దక్షిణ కొరియాలో నివసిస్తున్నారు.

వరుస దాడులు

పాకిస్థాన్​లో హిందూ ఆలయాలపై దాడులు ఇటీవల ఎక్కువయ్యాయి. కొద్దిరోజుల క్రితమే కొందరు రహీమ్​ యార్​ ఖాన్​ జిల్లాలోని భోంగ్​ గ్రామంలోని గుడిని కొందరు ధ్వంసం చేశారు.

ఆలయాలపై దాడుల విషయంలో భారత్​ ఎప్పటికప్పుడు పాకిస్థాన్​ ప్రభుత్వానికి తన అసంతృప్తిని తెలియజేస్తోంది.

ఇదీ చూడండి: మలేసియాలో రాజకీయ అస్థిరత.. ఆజ్యం పోస్తున్న కరోనా

Last Updated : Aug 31, 2021, 2:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.