ETV Bharat / international

వియత్నాంలో వరదల బీభత్సం- 17మంది మృతి - vietnam flood situation latest news

వరదల ఉద్ధృతి కారణంగా వియత్నాంలో 17మంది మృతిచెందినట్టు స్థానికి మీడియా సంస్థ వెల్లడించింది. వారం రోజుల నుంచి వరద భీభత్సం కొనసాగుతోందని పేర్కొంది.

vietnam_floods
వియత్నాంలో వరదల కారణంగా 17 మంది మృతి
author img

By

Published : Oct 12, 2020, 8:09 PM IST

భారీ వర్షాలకు వియత్నాం అతలాకుతలమైంది. వారం రోజులుగా కొనసాగుతున్న వరద ఉద్ధృతి కారణంగా దేశవ్యాప్తంగా 17మంది మృతి చెందినట్టు స్థానిక మీడియా సంస్థ పేర్కొంది. లిన్ఫా తుఫాను కారణంగా దాదాపు పది రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయని తెలిపింది.

ఇప్పటికే అనేక నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయని అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు వరదల కారణంగా లక్ష ఇళ్లు నీటమునిగాయి పేర్కొన్నారు. మరిన్ని ప్రాంతాలు నీటమునిగే అవకాశమున్నట్టు హెచ్చరించారు.

వరదల నేపథ్యంలో దాదాపు 50,000 మందిని ప్రమాదకర ప్రాంతాల నుంచి ఇతర ప్రదేశాలకు తరలించారు అధికారులు.

ఇదీ చదవండి:ఆ మాస్కులను రోజూ ఉతకకపోతే అంతే!

భారీ వర్షాలకు వియత్నాం అతలాకుతలమైంది. వారం రోజులుగా కొనసాగుతున్న వరద ఉద్ధృతి కారణంగా దేశవ్యాప్తంగా 17మంది మృతి చెందినట్టు స్థానిక మీడియా సంస్థ పేర్కొంది. లిన్ఫా తుఫాను కారణంగా దాదాపు పది రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయని తెలిపింది.

ఇప్పటికే అనేక నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయని అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు వరదల కారణంగా లక్ష ఇళ్లు నీటమునిగాయి పేర్కొన్నారు. మరిన్ని ప్రాంతాలు నీటమునిగే అవకాశమున్నట్టు హెచ్చరించారు.

వరదల నేపథ్యంలో దాదాపు 50,000 మందిని ప్రమాదకర ప్రాంతాల నుంచి ఇతర ప్రదేశాలకు తరలించారు అధికారులు.

ఇదీ చదవండి:ఆ మాస్కులను రోజూ ఉతకకపోతే అంతే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.