మయన్మార్ హింసాత్మక ఘటనలపై సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్బుక్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశంలో సైన్యం అధికారాన్ని చేజిక్కుంచుకున్న తరుణంలో.. ఆ విభాగానికి చెందిన మొత్తం ఖాతాలతో సహా వారి అనుబంధంలోని అన్ని కంపెనీల ప్రకటనలపై నిషేధం విధిస్తున్నట్టు గురువారం ప్రకటించింది. హింసాత్మక విధానాలతో తమ సంస్థ నిబంధనలను మిలిటరీ పదేపదే ఉల్లంఘించినందునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పింది ఫేస్బుక్.
సైనిక తిరుగుబాటు తర్వాత ఇప్పటికే ప్రముఖ మయవాడి టీవీ, టెలివిజన్ బ్రాడ్కాస్టర్ ఎంఆర్టీవీ సహా.. సైన్యానికి అనుసంధానమైన పలు ఖాతాలపై నిషేధం విధించింది. అంతేకాకుండా ఫేస్బుక్ యాజమాన్యంలో ఉన్న 'ఇన్స్టాగ్రామ్'లోనూ ఈ నిషేధాజ్ఞలు వర్తింపజేసింది.
ఆంగ్ సూకీ ప్రభుత్వంతో పాటు ఆమె నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ పార్టీని బహిష్కరించినుందుకు కొందరు సైనికాధికారుల ఖాతాలపై 2018లోనే నిషేధం విధించింది ఫేస్బుక్. నాడు.. తిరుగుబాటుకు నాయకత్వం వహించిన సీనియర్ జనరల్ మిన్ ఆంగ్ హేలింగ్.. ప్రస్తుతం సైనిక ప్రభుత్వాన్ని నడుపుతున్నారు.
ఇదీ చదవండి: 'ఆధునిక ప్రపంచంలో తిరుగుబాట్లకు స్థానం లేదు'