ETV Bharat / international

సౌదీ ఆరాంకో చమురుశుద్ధి కర్మాగారంపై డ్రోన్ దాడి

సౌదీ అరేబియాలో ఆరాంకో సంస్థ నిర్వహిస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద చమురుశుద్ధి కర్మాగారంపై డ్రోన్ దాడి జరిగింది. అయితే ఈ దాడికి ఏ ఉగ్రవాద సంస్థా బాధ్యత ప్రకటించుకోలేదు. గతంలో ఈ తరహా దాడులు చేసిన యెమెన్​కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

author img

By

Published : Sep 14, 2019, 2:10 PM IST

Updated : Sep 30, 2019, 2:01 PM IST

సౌదీ ఆరాంకో చమురుశుద్ధి కర్మాగారంపై డ్రోన్ దాడి

సౌదీ అరేబియాలోని ప్రపంచంలోనే అతిపెద్ద చమురుశుద్ధి కర్మాగారంపై శనివారం డ్రోన్​ దాడి జరిగింది. ఫలితంగా భారీ ఎత్తున అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి. సౌదీ ఆరాంకో సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ కర్మాగారంపై ఎవరు దాడికి పాల్పడ్డారో ఇప్పటి వరకు తెలియరాలేదని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఘటనపై ఆరాంకో స్పందించలేదు.

"చమురు శుద్ధి కర్మాగారం లక్ష్యంగా డ్రోన్​లు దాడులు చేశాయి. ఫలితంగా చమురు క్షేత్రంలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఘటనపై దర్యాప్తు చేస్తున్నాం. "
- సౌదీ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ

బుక్యాక్​, ఖురైస్​ చమురు క్షేత్రాల్లో జరిగిన దాడులకు ఇప్పటి వరకు ఏ ఉగ్రసంస్థ బాధ్యత వహించలేదు. అయితే గతంలో ఈ తరహా డ్రోన్​ దాడులు చేసిన యెమెన్​కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

డ్రోన్ దాడిలో ఎవరైనా గాయపడ్డారా? లేదా చమురు ఉత్పత్తిపై ప్రభావం పడిందా? అనే విషయాలు స్పష్టంగా తెలియడం లేదు. అమెరికా - ఇరాన్ మధ్య అణు ఒప్పందం విషయమై ఏర్పడిన ఘర్షణ నేపథ్యంలో.. పర్షియన్ గల్ఫ్​లో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి.

ఇదీ చూడండి: ఈ-కామర్స్​ సంస్థల భారీ డిస్కౌంట్​​ ఆఫర్లను నిషేధిస్తారా?

సౌదీ అరేబియాలోని ప్రపంచంలోనే అతిపెద్ద చమురుశుద్ధి కర్మాగారంపై శనివారం డ్రోన్​ దాడి జరిగింది. ఫలితంగా భారీ ఎత్తున అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి. సౌదీ ఆరాంకో సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ కర్మాగారంపై ఎవరు దాడికి పాల్పడ్డారో ఇప్పటి వరకు తెలియరాలేదని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఘటనపై ఆరాంకో స్పందించలేదు.

"చమురు శుద్ధి కర్మాగారం లక్ష్యంగా డ్రోన్​లు దాడులు చేశాయి. ఫలితంగా చమురు క్షేత్రంలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఘటనపై దర్యాప్తు చేస్తున్నాం. "
- సౌదీ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ

బుక్యాక్​, ఖురైస్​ చమురు క్షేత్రాల్లో జరిగిన దాడులకు ఇప్పటి వరకు ఏ ఉగ్రసంస్థ బాధ్యత వహించలేదు. అయితే గతంలో ఈ తరహా డ్రోన్​ దాడులు చేసిన యెమెన్​కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

డ్రోన్ దాడిలో ఎవరైనా గాయపడ్డారా? లేదా చమురు ఉత్పత్తిపై ప్రభావం పడిందా? అనే విషయాలు స్పష్టంగా తెలియడం లేదు. అమెరికా - ఇరాన్ మధ్య అణు ఒప్పందం విషయమై ఏర్పడిన ఘర్షణ నేపథ్యంలో.. పర్షియన్ గల్ఫ్​లో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి.

ఇదీ చూడండి: ఈ-కామర్స్​ సంస్థల భారీ డిస్కౌంట్​​ ఆఫర్లను నిషేధిస్తారా?

Dindori (Madhya Pradesh), Sep 14 (ANI): A lawyer from Madhya Pradesh's Dindori has been eating glass since last 40-45 years. Dayaram Sahu has been eating glass since past many years. This habit has caused damage to Sahu's teeth and now he is trying to reduce eating glasses. While speaking to media Sahu said, "It is an addiction for me. This habit has caused damage to my teeth. I wouldn't suggest others to follow as it's dangerous for health. I have reduced eating it now."
Last Updated : Sep 30, 2019, 2:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.