ETV Bharat / international

నేపాల్​ భూముల ఆక్రమణ వార్తలను ఖండించిన చైనా

నేపాల్​ హుమ్ల జిల్లాలోని సరిహద్దు భూములను ఆక్రమించి, నిర్మాణాలు చేపడుతున్నట్లు వచ్చిన వార్తలను ఖండించింది చైనా. ఆయా నిర్మాణాలు తమ భూభాగంలోకే వస్తాయని, అవి టిబెట్​లోని కొత్త గ్రామం పరిధిలోకి స్పష్టం చేసింది.

author img

By

Published : Oct 17, 2020, 11:11 AM IST

China denies encroaching on Nepali land
నేపాల్​ భూముల ఆక్రమణ వార్తలను ఖండించిన చైనా

నేపాల్​ సరిహద్దు భూములను ఆక్రమించినట్లు వస్తున్న వార్తలను చైనా ఖండించింది. తాము చేపట్టిన నిర్మాణాలు తమ భూభాగంలోకే వస్తాయని పేర్కొంది. వాస్తవానికి అవి టెబెట్​లో కొత్తగా నిర్మించిన గ్రామంగా వివరించింది. నేపాల్​కు చెందిన ఆక్రమిత భూమి కాదని చైనా అధికారిక మీడియా గ్లోబల్​ టైమ్స్​ స్పష్టం చేసింది.

నేపాల్​లోని హుమ్ల జిల్లాలోని సరిహద్దు భూములను చైనా ఆక్రమించి, నిర్మాణాలు చేపడుతున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో ఈ మేరకు స్పందించింది గ్లోబల్​ టైమ్స్​.

" నేపాల్​లో కొందరు వారి భూములను ఆక్రమించినట్లు ఆరోపించిన నిర్మాణాలు చైనా భూభాగంలోకే వస్తాయి. వాస్తవానికి నైరుతి చైనాలోని స్వయం ప్రతిపత్తి గల టిబెట్​లో కొత్తగా నిర్మించిన గ్రామం."

- గ్లోబల్​ టైమ్స్​, చైనా అధికారిక మీడియా.

నేపాల్​లోని హుమ్ల జిల్లాకు చెందిన భూములను చైనా ఆక్రమించుకుందని ఆ దేశ విపక్ష నేత జీవన్​ బహదూర్​ షాహి రెండు రోజుల క్రితం సంచలన వ్యాఖ్యలు చేశారు. సరిహద్దు ప్రజలు అనేక విధాలుగా సమస్యలు ఎదుర్కొంటున్నారని.. ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆరోపించారు. అయితే.. ఈ వ్యాఖ్యలను తోసిపుచ్చింది ప్రధాని కేపీ శర్మ ఓలీ నేతృత్వంలోని ప్రభుత్వం.

ఇదీ చూడండి: 'నేపాల్​ సరిహద్దు భూములను ఆక్రమించిన చైనా'

నేపాల్​ సరిహద్దు భూములను ఆక్రమించినట్లు వస్తున్న వార్తలను చైనా ఖండించింది. తాము చేపట్టిన నిర్మాణాలు తమ భూభాగంలోకే వస్తాయని పేర్కొంది. వాస్తవానికి అవి టెబెట్​లో కొత్తగా నిర్మించిన గ్రామంగా వివరించింది. నేపాల్​కు చెందిన ఆక్రమిత భూమి కాదని చైనా అధికారిక మీడియా గ్లోబల్​ టైమ్స్​ స్పష్టం చేసింది.

నేపాల్​లోని హుమ్ల జిల్లాలోని సరిహద్దు భూములను చైనా ఆక్రమించి, నిర్మాణాలు చేపడుతున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో ఈ మేరకు స్పందించింది గ్లోబల్​ టైమ్స్​.

" నేపాల్​లో కొందరు వారి భూములను ఆక్రమించినట్లు ఆరోపించిన నిర్మాణాలు చైనా భూభాగంలోకే వస్తాయి. వాస్తవానికి నైరుతి చైనాలోని స్వయం ప్రతిపత్తి గల టిబెట్​లో కొత్తగా నిర్మించిన గ్రామం."

- గ్లోబల్​ టైమ్స్​, చైనా అధికారిక మీడియా.

నేపాల్​లోని హుమ్ల జిల్లాకు చెందిన భూములను చైనా ఆక్రమించుకుందని ఆ దేశ విపక్ష నేత జీవన్​ బహదూర్​ షాహి రెండు రోజుల క్రితం సంచలన వ్యాఖ్యలు చేశారు. సరిహద్దు ప్రజలు అనేక విధాలుగా సమస్యలు ఎదుర్కొంటున్నారని.. ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆరోపించారు. అయితే.. ఈ వ్యాఖ్యలను తోసిపుచ్చింది ప్రధాని కేపీ శర్మ ఓలీ నేతృత్వంలోని ప్రభుత్వం.

ఇదీ చూడండి: 'నేపాల్​ సరిహద్దు భూములను ఆక్రమించిన చైనా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.