ఏప్రిల్ 24న ఇండోనేసియాలోని జకార్తాలో ఆసియాన్ దేశాల సదస్సు జరగనుంది. మయన్మార్లో నెలకొన్న రాజకీయ సంక్షోభంపై చర్చించేందుకు సమావేశమవుతున్నట్లు ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడోడో సన్నిహిత వర్గాలు తెలిపాయి. 10 సభ్య దేశాల అధినేతలందరూ పాల్గొనే అవకాశం ఉన్నట్లు వెల్లడించాయి.
మయన్మార్లో సైనిక ప్రభుత్వ మారణకాండలో దాదాపు 700లకుపైగా పౌరులు మరణించారు. మయన్మార్లో సైన్యం తిరుగుబాటు చేసిన తర్వాత ఘర్షణల్లో వందల మంది చనిపోయిన క్రమంలో ఆసియన్ సదస్సుకు పిలుపునిచ్చారు విడోడో. ఈ క్రమంలో భేటీ అవుతున్నట్లు తెలుస్తోంది.
సభ్యత్వ దేశాలివే
మొత్తం 10దేశాలు ఈ కూటమిలో ఉన్నాయి. ఇండోనేసియా, పిలిప్పిన్స్, సింగపూర్, థాయిలాండ్, బ్రూనై, వియత్నాం, లావోస్, మయన్మార్, కాంబోడియా. వాటితో పాటు భారత్, చైనా, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలు పార్ట్నర్ దేశాలుగా ఉన్నాయి.
ఇదీ చదవండి : 'బ్రెగ్జిట్'పై చర్చల్లో ఈయూ, బ్రిటన్ విఫలం!