ETV Bharat / international

పాక్​ ఆక్రమిత కశ్మీర్​లో చైనా వ్యతిరేక నిరసనలు

author img

By

Published : Jul 7, 2020, 9:07 AM IST

Updated : Jul 7, 2020, 10:08 AM IST

పాకిస్థాన్​ ఆక్రమిత కశ్మీర్​లోని ముజఫరా​బాద్​ ప్రజలు.. చైనాకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. నీలమ్​, జీలమ్​ నదులపై చైనా-పాక్​ అక్రమంగా ఆనకట్టలు నిర్మిస్తున్నాయని ఆరోపిస్తూ.. భారీ స్థాయిలో ర్యాలీ నిర్వహించారు.

Anti-China protests held in PoK against illegal construction of dams
పాక్​ ఆక్రమిత కశ్మీర్​లో చైనా వ్యతిరేక నిరసనలు

చైనాకు వ్యతిరేకంగా నిరసనలకు దిగారు పాకిస్థాన్​ ఆక్రమిత కశ్మీర్​లోని ముజఫరా​బాద్​ ప్రజలు. నీలమ్​, జీలమ్​ నదులపై పాకిస్థాన్​-చైనా అక్రమంగా నిర్మిస్తున్న ఆనకట్టలపై తమ ఆందోళన వ్యక్తం చేశారు.

నీలమ్​, జీలమ్​, కోహల హైడ్రో ప్రాజెక్టులకు వ్యతిరేకంగా సోమవారం భారీ ఎత్తున ర్యాలీ చేపట్టారు ప్రజలు. ఆనకట్టల నిర్మాణంతో పర్యావరణానికి జరిగే నష్టంపై గళం విప్పారు.

చైనా, పాకిస్థాన్​ ప్రభుత్వాలు, చైనా కంపెనీల మధ్య ఇటీవలే ఓ త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా కోహలలో 2.4 బిలియన్​ డాలర్ల ఖర్చుతో 1,124 మెగావాట్​ హైడ్రోపవర్​ ప్రాజెక్ట్​ను నిర్మించనున్నారు.

అయితే ఈ వివాదాస్పద ప్రాంతంలో ఏ చట్టాన్ని పరిగణించి ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారని నిరసనకారులు ప్రశ్నిస్తున్నారు. ఐరాస భద్రతా మండలి తీర్మానాన్ని చైనా, పాక్​ ప్రభుత్వాలు ఉల్లంఘిస్తున్నాయని ఆరోపించారు.

సీపెక్​(చైనా పాకిస్థాన్​ ఎకనామిక్​ కారిడర్​) పేరుతో చైనా తమపై ఆధిపత్యాన్ని చెలాయిస్తోందని ఇప్పటికే తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు పాక్​ ఆక్రమిత కశ్మీర్​ ప్రజలు.

ఇదీ చూడండి:- 'చైనా వెనక్కి తగ్గినా.. భారత్​ అప్రమత్తంగానే ఉండాలి'

చైనాకు వ్యతిరేకంగా నిరసనలకు దిగారు పాకిస్థాన్​ ఆక్రమిత కశ్మీర్​లోని ముజఫరా​బాద్​ ప్రజలు. నీలమ్​, జీలమ్​ నదులపై పాకిస్థాన్​-చైనా అక్రమంగా నిర్మిస్తున్న ఆనకట్టలపై తమ ఆందోళన వ్యక్తం చేశారు.

నీలమ్​, జీలమ్​, కోహల హైడ్రో ప్రాజెక్టులకు వ్యతిరేకంగా సోమవారం భారీ ఎత్తున ర్యాలీ చేపట్టారు ప్రజలు. ఆనకట్టల నిర్మాణంతో పర్యావరణానికి జరిగే నష్టంపై గళం విప్పారు.

చైనా, పాకిస్థాన్​ ప్రభుత్వాలు, చైనా కంపెనీల మధ్య ఇటీవలే ఓ త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా కోహలలో 2.4 బిలియన్​ డాలర్ల ఖర్చుతో 1,124 మెగావాట్​ హైడ్రోపవర్​ ప్రాజెక్ట్​ను నిర్మించనున్నారు.

అయితే ఈ వివాదాస్పద ప్రాంతంలో ఏ చట్టాన్ని పరిగణించి ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారని నిరసనకారులు ప్రశ్నిస్తున్నారు. ఐరాస భద్రతా మండలి తీర్మానాన్ని చైనా, పాక్​ ప్రభుత్వాలు ఉల్లంఘిస్తున్నాయని ఆరోపించారు.

సీపెక్​(చైనా పాకిస్థాన్​ ఎకనామిక్​ కారిడర్​) పేరుతో చైనా తమపై ఆధిపత్యాన్ని చెలాయిస్తోందని ఇప్పటికే తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు పాక్​ ఆక్రమిత కశ్మీర్​ ప్రజలు.

ఇదీ చూడండి:- 'చైనా వెనక్కి తగ్గినా.. భారత్​ అప్రమత్తంగానే ఉండాలి'

Last Updated : Jul 7, 2020, 10:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.