పాకిస్థాన్లోని బలూచిస్థాన్లో వరుస ఉగ్రదాడులు కలకలం రేపాయి. క్వెట్టా, సిబీ నగరాల్లో జరిగిన వరుస పేలుళ్లలో కనీసం ఇద్దరు మరణించారు. మరో 28మంది గాయపడ్డారు. ఈ ఘటనకు ఏ ఉగ్రవాద సంస్థ ఇంతవరకూ బాధ్యత వహించలేదు.
సిబీ నగరంలో మొదట జరిగిన పేలుడులో 24మంది గాయపడ్డారు. ఈ ఘటన అనంతరం గంటల వ్యవధిలోనే క్వెట్టాలో రెండవ పేలుడు జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ దాడిలో ఇద్దరు మరణించారు. మరో నలుగురు గాయపడ్డారు. కశ్మీర్ డే ర్యాలీని లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగింది. ఈ పేలుళ్లకు ఏ ఉగ్రవాద సంస్థా బాధ్యత వహించలేదని బలూచిస్థాన్ పోలీసులు తెలిపారు.
బలూచిస్థాన్కు మరింత స్వయంప్రతిపత్తి కల్పించాలని కొన్ని వేర్పాటువాద సంఘాలు కొద్దికాలంగా ఆందోళనలు చేస్తున్నాయి. ఇక్కడి గ్యాస్, చమురు వంటి సహజ వనరుల్లో అధిక వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి.
ఇదీ చదవండి: పాకిస్థాన్లో బాంబు పేలుడు- 11మంది జవాన్లకు గాయాలు