ETV Bharat / international

టిక్​టాక్​ బ్యాన్​ వెనుక ఫేస్​బుక్​ 'మార్క్'!

author img

By

Published : Aug 24, 2020, 7:07 PM IST

అమెరికాలో టిక్​టాక్ నిషేధం దిశగా పడుతున్న అడుగుల వెనుక ఫేస్​బుక్​ సీఈఓ మార్క్​ జుకర్​బర్గ్ కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. అమెరికాకు చెందిన ఓ ప్రముఖ వార్తా సంస్థ ప్రచురించిన కథనం ఈ వాదనలకు మరింత ఊతమిస్తోంది. ఆ కథనంలో ఏముంది? టిక్​టాక్​పై మార్క్ జకర్​బర్గ్ వ్యక్తం చేసిన ఆందోళనలు ఏమిటి?

Mark Zuckerberg fears on tiktok
టిక్​టాక్​పై మార్క్ జుకర్​బర్గ్ ఆందోళలు

అమెరికా ప్రభుత్వం కన్నా ముందే.. టిక్​టాక్​తో దేశ భద్రతకు ముప్పు వాటిల్లుతుందని ఫేస్​బుక్ సీఈఓ మార్క్ జుకర్​బర్గ్ భయాలు రేకెత్తించినట్లు ప్రముఖ వార్తా సంస్థ వాల్​ స్ట్రీట్ జర్నల్​ పేర్కొంది. ఇటీవల ప్రచురించిన ఓ కథనంలో టిక్​టాక్​పై జుకర్​బర్గ్​ వ్యక్తం చేసిన పలు అభ్యంతరాలను ప్రస్తావించింది. ప్రస్తుత పరిణామాలకు మార్క్ జుకర్​బర్గ్ వ్యక్తం చేసిన ఆందోళనలే ఆజ్యం పోశాయనేది ఈ కథనం సారాశం.

చైనాకు చెందిన షార్ట్ వీడియో యాప్ టిక్​టాక్​పై ఆంక్షల దిశగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొన్ని రోజులుగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్​పై సంతకం కూడా చేశారు. టిక్​టాక్​ను 90 రోజుల్లో విక్రయించకుంటే నిషేధం తప్పదని దాని మాతృసంస్థ బైట్​ డ్యాన్స్​కు ఇదివరకే డెడ్​లైన్ కూడా విధించారు. ముఖ్యంగా ఇటీవల టిక్​టాక్​ అంశాన్ని అమెరికా తీవ్రంగా పరిగణిస్తోంది. అయితే వాల్ట్​ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం.. టిక్​టాక్​పై ఆంక్షలకు జరుగుతున్న కసరత్తు ఇటీవలిది కాదని తెలుస్తోంది.

ట్రంప్​-జుకర్​బర్గ్​ విందులో కీలక నిర్ణయాలు?

బైట్​ డ్యాన్స్​కు చెందిన టిక్​టాక్ సంస్థ భావ ప్రకటన స్వేచ్ఛకు కట్టుబడి లేదని, అమెరికా సాంకేతికతకు ఇది ముప్పుగా మారుతుందనే ఆందోళన మార్క్ వ్యక్తం చేసినట్లు ఈ కథనంలో పేర్కొంది వాల్​ స్ట్రీట్​ జర్నల్. శ్వేతసౌధంలో ట్రంప్​ ప్రత్యేకంగా ఇచ్చిన విందులో మార్క్​ జుకర్​బర్గ్​కు చైనా ఇంటర్నెట్ కంపెనీలపై కేసు వేసేందుకు అవకాశం కూడా పొందినట్లు వాల్​ స్ట్రీట్ రాసుకొచ్చింది.

అమెరికా సెనెటర్లతో జరిగిన పలు సమావేశాల్లోనూ ఇదే విషయంపై మార్క్ తన వాదనను వినిపించారని పేర్కొంది. టిక్​టాక్ విషయాన్ని తీవ్రంగా పరిగణించాలని సూచించినట్లు తెలిపింది. దీనితో ఆ దేశ భద్రతపై ప్రభుత్వం సమీక్షను ప్రారంభించినట్లు వెల్లడించింది.

తాజా పరిణామాలు కొన్ని ఈ కథనానికి మరింత ఊతమిస్తున్నాయి.

ఇటీవలే ఫేస్​బుక్​కు చెందిన ఇన్​స్టాగ్రామ్​లో టిక్​టాక్​కు పోటీగా రీల్స్ అనే ఫీచర్​ అందుబాటులోకి రావడం గమనార్హం.

మరోవైపు టిక్​టాక్​ కొనుగోలు కోసం బైట్​ డ్యాన్స్​తో చర్చలు జరుపుతున్నట్లు టెక్​ దిగ్గజం మైక్రోసాఫ్ట్ అధికారికంగా వెల్లడించిన విషయం తెలిసిందే. అధికారికంగా ప్రకటించకున్నా.. ట్విట్టర్​, ఓరాకిల్, అల్ఫాబెట్ వంటి సంస్థలు ఈ రేసులో ఉన్నట్లు సమాచారం.

ఇదీ చూడండి:దేశీయంగా ఐఫోన్ ఎస్​ఈ2 ఉత్పత్తి షురూ

అమెరికా ప్రభుత్వం కన్నా ముందే.. టిక్​టాక్​తో దేశ భద్రతకు ముప్పు వాటిల్లుతుందని ఫేస్​బుక్ సీఈఓ మార్క్ జుకర్​బర్గ్ భయాలు రేకెత్తించినట్లు ప్రముఖ వార్తా సంస్థ వాల్​ స్ట్రీట్ జర్నల్​ పేర్కొంది. ఇటీవల ప్రచురించిన ఓ కథనంలో టిక్​టాక్​పై జుకర్​బర్గ్​ వ్యక్తం చేసిన పలు అభ్యంతరాలను ప్రస్తావించింది. ప్రస్తుత పరిణామాలకు మార్క్ జుకర్​బర్గ్ వ్యక్తం చేసిన ఆందోళనలే ఆజ్యం పోశాయనేది ఈ కథనం సారాశం.

చైనాకు చెందిన షార్ట్ వీడియో యాప్ టిక్​టాక్​పై ఆంక్షల దిశగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొన్ని రోజులుగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్​పై సంతకం కూడా చేశారు. టిక్​టాక్​ను 90 రోజుల్లో విక్రయించకుంటే నిషేధం తప్పదని దాని మాతృసంస్థ బైట్​ డ్యాన్స్​కు ఇదివరకే డెడ్​లైన్ కూడా విధించారు. ముఖ్యంగా ఇటీవల టిక్​టాక్​ అంశాన్ని అమెరికా తీవ్రంగా పరిగణిస్తోంది. అయితే వాల్ట్​ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం.. టిక్​టాక్​పై ఆంక్షలకు జరుగుతున్న కసరత్తు ఇటీవలిది కాదని తెలుస్తోంది.

ట్రంప్​-జుకర్​బర్గ్​ విందులో కీలక నిర్ణయాలు?

బైట్​ డ్యాన్స్​కు చెందిన టిక్​టాక్ సంస్థ భావ ప్రకటన స్వేచ్ఛకు కట్టుబడి లేదని, అమెరికా సాంకేతికతకు ఇది ముప్పుగా మారుతుందనే ఆందోళన మార్క్ వ్యక్తం చేసినట్లు ఈ కథనంలో పేర్కొంది వాల్​ స్ట్రీట్​ జర్నల్. శ్వేతసౌధంలో ట్రంప్​ ప్రత్యేకంగా ఇచ్చిన విందులో మార్క్​ జుకర్​బర్గ్​కు చైనా ఇంటర్నెట్ కంపెనీలపై కేసు వేసేందుకు అవకాశం కూడా పొందినట్లు వాల్​ స్ట్రీట్ రాసుకొచ్చింది.

అమెరికా సెనెటర్లతో జరిగిన పలు సమావేశాల్లోనూ ఇదే విషయంపై మార్క్ తన వాదనను వినిపించారని పేర్కొంది. టిక్​టాక్ విషయాన్ని తీవ్రంగా పరిగణించాలని సూచించినట్లు తెలిపింది. దీనితో ఆ దేశ భద్రతపై ప్రభుత్వం సమీక్షను ప్రారంభించినట్లు వెల్లడించింది.

తాజా పరిణామాలు కొన్ని ఈ కథనానికి మరింత ఊతమిస్తున్నాయి.

ఇటీవలే ఫేస్​బుక్​కు చెందిన ఇన్​స్టాగ్రామ్​లో టిక్​టాక్​కు పోటీగా రీల్స్ అనే ఫీచర్​ అందుబాటులోకి రావడం గమనార్హం.

మరోవైపు టిక్​టాక్​ కొనుగోలు కోసం బైట్​ డ్యాన్స్​తో చర్చలు జరుపుతున్నట్లు టెక్​ దిగ్గజం మైక్రోసాఫ్ట్ అధికారికంగా వెల్లడించిన విషయం తెలిసిందే. అధికారికంగా ప్రకటించకున్నా.. ట్విట్టర్​, ఓరాకిల్, అల్ఫాబెట్ వంటి సంస్థలు ఈ రేసులో ఉన్నట్లు సమాచారం.

ఇదీ చూడండి:దేశీయంగా ఐఫోన్ ఎస్​ఈ2 ఉత్పత్తి షురూ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.