ETV Bharat / international

జూన్​లో​ అమెరికా-రష్యా అధ్యక్షుల భేటీ - అమెరికా రష్యా అధ్యక్షుల సమావేశం

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్​లు వచ్చే నెలలో జెనీవాలో సమావేశమవనున్నారు. రష్యా, అమెరికా మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో అగ్ర నేతల భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

biden, puthin
అమెరికా-రష్యా
author img

By

Published : May 25, 2021, 8:07 PM IST

Updated : May 25, 2021, 10:49 PM IST

అమెరికా, రష్యా అధ్యక్షులు వచ్చే నెలలో భేటీ కానున్నారు. అధ్యక్షుడు జో బైడెన్,​ వ్లాదిమిర్ పుతిన్​లు స్విట్జర్లాండ్​లోని జెనీవా వేదికగా జూన్​ 16న ఈ సమావేశం జరగనుందని శ్వేతసౌధం వెల్లడించింది. రష్యా, అమెరికా మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో అగ్ర నేతల భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. నాటో సమ్మిట్​ కోసం వచ్చే నెలలో బ్రిటన్​ వెళ్లనున్న బైడెన్​.. ఆ పర్యటన అనంతరం పుతిన్​తో సమావేశమవనున్నారు.

ఇరుదేశాల నేతలు భేటీ కానున్నారని రష్యా సైతం ఓ ప్రకటనలో తెలిపింది. రష్యా-అమెరికా సంబంధాలు, ప్రపంచంలో ప్రధాన సమస్యలపై అంతర్జాతీయ అజెండా, ప్రాంతీయ సమస్యలు, కరోనా వైరస్​పై అనుసరించాల్సిన విధివిధానాలపై చర్చలు జరుపుతారని వెల్లడించింది.

ఎన్నో ఆరోపణలున్నా..

గత ఏడాది జరిగిన అమెరికా ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుందని అమెరికా ఆరోపించింది. తమ నెట్​వర్క్​పై రష్యా హ్యాకింగ్ చేసిందని తీవ్రంగా విమర్శించింది. రష్యా ప్రతిపక్షనేత నవాల్ని అరెస్ట్ కు సంబంధించిన విషయంలోనూ పుతిన్​ను బైడెన్​ తప్పుబట్టారు. ఎన్నికల ప్రచారంలోనూ రష్యా నుంచి అమెరికాకు ముప్పు పొంచి ఉందని అన్నారు. అయినా.. రష్యాతో స్థిరమైన, నమ్మకమైన సంబంధాలను కోరుకుంటున్నట్లు అమెరికా ఇప్పటికే ఎన్నోసార్లు ప్రకటించింది.

ఆంక్షల నేపథ్యంలో..

బైడెన్​ అధికారంలోకి వచ్చాక మార్చిలో.. రష్యా దౌత్యవేత్తలపై ఆంక్షలు విధించారు. రష్యాకు చెందిన పలు వ్యాపారాలను నిషేధించారు. గత నెలలోనూ 10 మంది రష్యా దౌత్యవేత్తలను అమెరికా నుంచి బహిష్కరించారు. మరోమారు ఆంక్షలను విధిస్తామని ఏప్రిల్​లో ప్రకటించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇరుదేశాల నేతలు భేటీ కానుండడం ప్రాధాన్యం కలిగి ఉంది.

ఇంతకాలానికి..

ప్రపంచ యుద్ధాలు ముగిసిన అనంతరం ఇరు దేశాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నెలకొంది. తదనంతర కాలంలో 1985న ఇరుదేశాల నేతలు అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్, మిఖెల్​ గోర్బచేవ్​లు మొదటిసారిగా కలుసుకున్నప్పుడు జెనీవానే వేదికయింది.

ఇంత కాలం తర్వాత మళ్లీ ఇరు దేశాల నేతలు జెనీవాలో కలుసుకుంటున్నారు.

ఇదీ చదవండి: 'గాజా పునర్నిర్మాణానికి అమెరికా సాయం.. కానీ'

అమెరికా, రష్యా అధ్యక్షులు వచ్చే నెలలో భేటీ కానున్నారు. అధ్యక్షుడు జో బైడెన్,​ వ్లాదిమిర్ పుతిన్​లు స్విట్జర్లాండ్​లోని జెనీవా వేదికగా జూన్​ 16న ఈ సమావేశం జరగనుందని శ్వేతసౌధం వెల్లడించింది. రష్యా, అమెరికా మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో అగ్ర నేతల భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. నాటో సమ్మిట్​ కోసం వచ్చే నెలలో బ్రిటన్​ వెళ్లనున్న బైడెన్​.. ఆ పర్యటన అనంతరం పుతిన్​తో సమావేశమవనున్నారు.

ఇరుదేశాల నేతలు భేటీ కానున్నారని రష్యా సైతం ఓ ప్రకటనలో తెలిపింది. రష్యా-అమెరికా సంబంధాలు, ప్రపంచంలో ప్రధాన సమస్యలపై అంతర్జాతీయ అజెండా, ప్రాంతీయ సమస్యలు, కరోనా వైరస్​పై అనుసరించాల్సిన విధివిధానాలపై చర్చలు జరుపుతారని వెల్లడించింది.

ఎన్నో ఆరోపణలున్నా..

గత ఏడాది జరిగిన అమెరికా ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుందని అమెరికా ఆరోపించింది. తమ నెట్​వర్క్​పై రష్యా హ్యాకింగ్ చేసిందని తీవ్రంగా విమర్శించింది. రష్యా ప్రతిపక్షనేత నవాల్ని అరెస్ట్ కు సంబంధించిన విషయంలోనూ పుతిన్​ను బైడెన్​ తప్పుబట్టారు. ఎన్నికల ప్రచారంలోనూ రష్యా నుంచి అమెరికాకు ముప్పు పొంచి ఉందని అన్నారు. అయినా.. రష్యాతో స్థిరమైన, నమ్మకమైన సంబంధాలను కోరుకుంటున్నట్లు అమెరికా ఇప్పటికే ఎన్నోసార్లు ప్రకటించింది.

ఆంక్షల నేపథ్యంలో..

బైడెన్​ అధికారంలోకి వచ్చాక మార్చిలో.. రష్యా దౌత్యవేత్తలపై ఆంక్షలు విధించారు. రష్యాకు చెందిన పలు వ్యాపారాలను నిషేధించారు. గత నెలలోనూ 10 మంది రష్యా దౌత్యవేత్తలను అమెరికా నుంచి బహిష్కరించారు. మరోమారు ఆంక్షలను విధిస్తామని ఏప్రిల్​లో ప్రకటించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇరుదేశాల నేతలు భేటీ కానుండడం ప్రాధాన్యం కలిగి ఉంది.

ఇంతకాలానికి..

ప్రపంచ యుద్ధాలు ముగిసిన అనంతరం ఇరు దేశాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నెలకొంది. తదనంతర కాలంలో 1985న ఇరుదేశాల నేతలు అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్, మిఖెల్​ గోర్బచేవ్​లు మొదటిసారిగా కలుసుకున్నప్పుడు జెనీవానే వేదికయింది.

ఇంత కాలం తర్వాత మళ్లీ ఇరు దేశాల నేతలు జెనీవాలో కలుసుకుంటున్నారు.

ఇదీ చదవండి: 'గాజా పునర్నిర్మాణానికి అమెరికా సాయం.. కానీ'

Last Updated : May 25, 2021, 10:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.