ETV Bharat / international

భారత్‌కు హార్పూన్​ క్షిపణి వ్యవస్థ

author img

By

Published : Aug 4, 2021, 7:11 AM IST

భారత్​, అమెరికాల రక్షణ సంబంధాలు బలోపేతం దిశగా మరో కీలక ముందడగు పడింది. ప్రపంచంలోనే అత్యుత్తమ నౌకా విధ్వంసక క్షిపణి 'హార్పూన్‌'కు సంబంధించిన పూర్తిస్థాయి వ్యవస్థను భారత్‌కు విక్రయించడానికి అమెరికా పచ్చజెండా ఊపింది. దీని విలువ 8.2 కోట్ల డాలర్లు.

US approves sale of Harpoon Joint Common Test Sets to India
భారత్‌కు హార్పూన్​ క్షిపణి వ్యవస్థ

ప్రపంచంలోనే అత్యుత్తమ నౌకా విధ్వంసక క్షిపణి 'హార్పూన్‌'కు సంబంధించిన పూర్తిస్థాయి వ్యవస్థను భారత్‌కు విక్రయించడానికి అమెరికా పచ్చజెండా ఊపింది. దీని విలువ 8.2 కోట్ల డాలర్లు. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి ఇది వీలు కల్పిస్తుందని అమెరికా రక్షణశాఖ పేర్కొంది. అలాగే ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో ప్రధాన రక్షణ భాగస్వామిగా ఉన్న భారత రక్షణ సామర్థ్యం మెరుగుపడుతుందని వివరించింది.

'హార్పూన్‌ జాయింట్‌ కామన్‌ టెస్ట్‌ సెట్‌' (జేసీటీఎస్‌) అనే ఈ వ్యవస్థను సరఫరా చేయాలని అమెరికాను భారత్‌ కోరింది. ఈ ప్యాకేజీలో ఒక హార్పూన్‌ మధ్యంతర స్థాయి నిర్వహణ కేంద్రం, విడిభాగాలు, పరీక్ష సాధనాలు, సాంకేతిక పత్రాలు, సిబ్బంది శిక్షణ తదితరాలు ఉంటాయి. దీని విక్రయానికి ఆమోదం తెలిపిన అమెరికా రక్షణ భద్రత సహకార సంస్థ (డీఎస్‌సీఏ).. ఈ విషయాన్ని ఇక్కడి కాంగ్రెస్‌కు తెలిపింది. తాజా నిర్ణయం వల్ల హార్పూన్‌ క్షిపణుల నిర్వహణ, మరమ్మతులు భారత్‌కు సులువవుతుందని పేర్కొంది. తద్వారా ఆ దేశ పోరాట సన్నద్ధత మెరుగుపడి, భద్రతా సవాళ్లను సమర్థంగా ఎదుర్కోగలుగుతుందని వివరించింది.

హార్పూన్‌ క్షిపణులను తొలిసారిగా 1977లో వినియోగం లోకి వచ్చింది. ఇది సముద్రజలాలకు చాలా దగ్గరగా పయనిస్తుంది. అందువల్ల శత్రు యుద్ధనౌకల కంటపడదు. బోయింగ్‌ సంస్థ దీన్ని ఉత్పత్తి చేస్తోంది. ఇది ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన నౌకా విధ్వంసక క్షిపణిగా గుర్తింపు పొందింది. 30కిపైగా దేశాలు వీటిని కొనుగోలు చేశాయి.

ఇదీ చూడండి: ‍‍‍ప్రపంచవ్యాప్తంగా 20 కోట్లు దాటిన కొవిడ్​ కేసులు

ప్రపంచంలోనే అత్యుత్తమ నౌకా విధ్వంసక క్షిపణి 'హార్పూన్‌'కు సంబంధించిన పూర్తిస్థాయి వ్యవస్థను భారత్‌కు విక్రయించడానికి అమెరికా పచ్చజెండా ఊపింది. దీని విలువ 8.2 కోట్ల డాలర్లు. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి ఇది వీలు కల్పిస్తుందని అమెరికా రక్షణశాఖ పేర్కొంది. అలాగే ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో ప్రధాన రక్షణ భాగస్వామిగా ఉన్న భారత రక్షణ సామర్థ్యం మెరుగుపడుతుందని వివరించింది.

'హార్పూన్‌ జాయింట్‌ కామన్‌ టెస్ట్‌ సెట్‌' (జేసీటీఎస్‌) అనే ఈ వ్యవస్థను సరఫరా చేయాలని అమెరికాను భారత్‌ కోరింది. ఈ ప్యాకేజీలో ఒక హార్పూన్‌ మధ్యంతర స్థాయి నిర్వహణ కేంద్రం, విడిభాగాలు, పరీక్ష సాధనాలు, సాంకేతిక పత్రాలు, సిబ్బంది శిక్షణ తదితరాలు ఉంటాయి. దీని విక్రయానికి ఆమోదం తెలిపిన అమెరికా రక్షణ భద్రత సహకార సంస్థ (డీఎస్‌సీఏ).. ఈ విషయాన్ని ఇక్కడి కాంగ్రెస్‌కు తెలిపింది. తాజా నిర్ణయం వల్ల హార్పూన్‌ క్షిపణుల నిర్వహణ, మరమ్మతులు భారత్‌కు సులువవుతుందని పేర్కొంది. తద్వారా ఆ దేశ పోరాట సన్నద్ధత మెరుగుపడి, భద్రతా సవాళ్లను సమర్థంగా ఎదుర్కోగలుగుతుందని వివరించింది.

హార్పూన్‌ క్షిపణులను తొలిసారిగా 1977లో వినియోగం లోకి వచ్చింది. ఇది సముద్రజలాలకు చాలా దగ్గరగా పయనిస్తుంది. అందువల్ల శత్రు యుద్ధనౌకల కంటపడదు. బోయింగ్‌ సంస్థ దీన్ని ఉత్పత్తి చేస్తోంది. ఇది ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన నౌకా విధ్వంసక క్షిపణిగా గుర్తింపు పొందింది. 30కిపైగా దేశాలు వీటిని కొనుగోలు చేశాయి.

ఇదీ చూడండి: ‍‍‍ప్రపంచవ్యాప్తంగా 20 కోట్లు దాటిన కొవిడ్​ కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.