ETV Bharat / international

అమెరికా పోలీసుల కాల్పుల్లో నల్లజాతీయుడు మృతి

జార్జి ఫ్లాయిడ్ తరహాలో మరో నల్ల జాతీయుడు పోలీసుల చేతిలో ప్రాణాలు కోల్పోవడం అమెరికాలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. మృతుడికి న్యాయం చేయాలంటూ ప్రజలు పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు.

author img

By

Published : Aug 23, 2020, 2:37 PM IST

Protest erupts over fatal police shooting of Black man
నల్లజాతీయుడిని కాల్చిచంపిన పోలీసులు.. అమెరికాలో మళ్లీ ఘర్షణలు

అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ 'బ్లాక్​ లైవ్స్​ మ్యాటర్​' నినాదాలు మార్మోగుతున్నాయి. తాజాగా లూసియానా పోలీసుల తుపాకులకు మరొక నల్లజాతీయుడు ప్రాణాలు కోల్పోవడమే ఇందుకు కారణం. ఓ స్టోర్​లోకి ట్రేఫోర్డ్​ పెల్లేరిన్​ అనే నల్లజాతీయుడు కత్తితో వెళ్తున్నాడని అతడిని కాల్చిచంపారు పోలీసులు. ఇది ప్రస్తుతం ఘర్షణలకు దారితీసింది.

అన్యాయంగా తన కొడుకును పొట్టనబెట్టుకున్నారని మృతుడి తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. ట్రేఫోర్డ్​ మానసిక సమస్యలతో బాధపడుతున్నాడని ఆమె పేర్కొన్నారు. అతడి మృతికి కారణమైన పోలీసులపై కేసు పెట్టినట్లు ఆమె తరఫు న్యాయవాది వెల్లడించారు. శుక్రవారం రాత్రి ఈ ఘటన జరగ్గా.. శనివారం భారీగా ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు.

ఉద్రిక్తంగా...

తొలుత నిరసనలు ప్రశాంతంగానే జరిగినా.. తర్వాత నివాస ప్రాంతాల్లో మందుగుండు పేల్చడం, రోడ్లపై వస్తువులను తగలబెట్టడం వల్ల పరిస్థితి అదుపు తప్పిందని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. దీంతో నిరసనకారులను చెదరగొట్టేందుకు పొగబాంబులు ప్రయోగించినట్లు వెల్లడించారు. శాంతిభద్రతల పరిరక్షణే తమ ధ్యేయమని పేర్కొన్నారు. ఘర్షణలకు కారణమైన కొందరిని అరెస్టులు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే వారు ఎంతమంది అనేది వెల్లడించలేదు.

ట్రేఫోర్డ్​ ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజీని పరిశీలించిన ఏసీఎల్​యూ, సదరన్​ పోవర్టీ లా సెంటర్.. తక్షణమే విచారణకు ఆదేశించాయి.

ఇదీ చదవండి: జాతి వివక్షతో నేలరాలిన ప్రాణాలు- ఉద్భవించిన ఆశలు

అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ 'బ్లాక్​ లైవ్స్​ మ్యాటర్​' నినాదాలు మార్మోగుతున్నాయి. తాజాగా లూసియానా పోలీసుల తుపాకులకు మరొక నల్లజాతీయుడు ప్రాణాలు కోల్పోవడమే ఇందుకు కారణం. ఓ స్టోర్​లోకి ట్రేఫోర్డ్​ పెల్లేరిన్​ అనే నల్లజాతీయుడు కత్తితో వెళ్తున్నాడని అతడిని కాల్చిచంపారు పోలీసులు. ఇది ప్రస్తుతం ఘర్షణలకు దారితీసింది.

అన్యాయంగా తన కొడుకును పొట్టనబెట్టుకున్నారని మృతుడి తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. ట్రేఫోర్డ్​ మానసిక సమస్యలతో బాధపడుతున్నాడని ఆమె పేర్కొన్నారు. అతడి మృతికి కారణమైన పోలీసులపై కేసు పెట్టినట్లు ఆమె తరఫు న్యాయవాది వెల్లడించారు. శుక్రవారం రాత్రి ఈ ఘటన జరగ్గా.. శనివారం భారీగా ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు.

ఉద్రిక్తంగా...

తొలుత నిరసనలు ప్రశాంతంగానే జరిగినా.. తర్వాత నివాస ప్రాంతాల్లో మందుగుండు పేల్చడం, రోడ్లపై వస్తువులను తగలబెట్టడం వల్ల పరిస్థితి అదుపు తప్పిందని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. దీంతో నిరసనకారులను చెదరగొట్టేందుకు పొగబాంబులు ప్రయోగించినట్లు వెల్లడించారు. శాంతిభద్రతల పరిరక్షణే తమ ధ్యేయమని పేర్కొన్నారు. ఘర్షణలకు కారణమైన కొందరిని అరెస్టులు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే వారు ఎంతమంది అనేది వెల్లడించలేదు.

ట్రేఫోర్డ్​ ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజీని పరిశీలించిన ఏసీఎల్​యూ, సదరన్​ పోవర్టీ లా సెంటర్.. తక్షణమే విచారణకు ఆదేశించాయి.

ఇదీ చదవండి: జాతి వివక్షతో నేలరాలిన ప్రాణాలు- ఉద్భవించిన ఆశలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.