ETV Bharat / international

మసాలా దోశలతో అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం!

ఒక వంటల కార్యక్రమం జరిగింది. ఇద్దరు మహిళలు కలిసి రుచికరమైన మసాలా దోశలు వేశారు. చాలా విషయాలు మాట్లాడుకున్నారు. రాజకీయాల గురించి ప్రత్యక్షంగా ఏమీ చర్చించలేదు. కానీ... అంతర్లీనంగా జరిగింది మాత్రం అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారమే. అదెలా? ఎవరా మహిళలు?

author img

By

Published : Nov 27, 2019, 11:35 AM IST

Kamala Harris joins Mindy Kaling to cook Masala Dosa
మసాలా దోశలతో అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం!

కమలా హ్యారిస్... భారత సంతతి అమెరికా సెనెటర్. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ తరఫున పోటీ చేయాలని ఆశిస్తున్న నేత. ఎన్నికల వ్యూహప్రతివ్యూహాలు, ప్రచారం ముమ్మరం అవుతున్న వేళ... ఆమె కాసేపు సరదాగా గడిపారు. మసాలా దోశ వేశారు. దక్షిణ భారత దేశ మూలాల్ని గుర్తుచేసుకున్నారు.

మిండీతో కలిసి...

అమెరికాలో ప్రఖ్యాత కమెడియన్, నటి, రచయిత మిండీ కలింగ్​తో కలిసి వంటల కార్యక్రమంలో పాల్గొన్నారు కమల. ఇందుకు లాస్​ ఏంజిల్స్​లోని మిండీ నివాసం వేదికైంది.

మిండీ అసలు పేరు వీర మిండీ చొకలింగం. ఆమె కూడా భారత సంతతి వ్యక్తి. కమలది చెన్నై. అందుకే దక్షిణ భారత దేశ వంటకమైన మసాలా దోశను ఎంచుకున్నారు. ఇద్దరూ కలిసి కూరగాయలు కోసి, మసాలా తయారు చేసి... రుచికరమైన దోశలు వేశారు.

ఈ వీడియోను కమల సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​ చేయగా... మంచి స్పందన లభిస్తోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

దోశల రాజకీయం!

డెమొక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థిగా నిలవాలని ఆశిస్తున్నారు కమల. ఇందుకోసం ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.

మసాలా దోశ తయారీ కార్యక్రమంలో ఎక్కడా రాజకీయాలు ప్రస్తావించలేదు కమల. కానీ అంతర్లీనంగా జరిగింది మాత్రమే ప్రచారమే.

వలసదారుల విషయంలో ట్రంప్​ కఠినంగా వ్యవహరిస్తున్నారన్నది ప్రత్యర్థుల ప్రధాన విమర్శ. ఇక్కడ కమల, మిండీ ఇద్దరూ వలసదారుల కుటుంబాలకు చెందిన వారే. మసాలా దోశ వేస్తున్నంత సేపు వారు... దక్షిణ భారత దేశంతో వారికి ఉన్న అనుబంధం గురించి, తమ కుటుంబం వలస రావడం గురించి, ఇతర వలసదారుల కథల గురించి చర్చించుకున్నారు. అలా ట్రంప్​కు పరోక్షంగా కౌంటర్​ ఇస్తూ... అమెరికాలో అధిక సంఖ్యలో ఉండే వలసదారుల ఓట్లకు వల వేశారు కమల.

డెమొక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్లు ఇటీవలే దిగ్గజ వ్యాపారవేత్త మైకేల్​ బ్లూమ్​బర్గ్​ ప్రకటించారు. ట్రంప్​ను ఢీకొట్టాలంటే ముందుగా బ్లూమ్​బర్గ్​తో పాటు మరికొందరు డెమొక్రాట్​ ఆశావహ అభ్యర్థుల్ని ప్రాథమిక ఎన్నికల్లో కమల ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ విషయంలో ఆమె ఏ మేర సఫలం అవుతారో వేచి చూడాలి.

కమలా హ్యారిస్... భారత సంతతి అమెరికా సెనెటర్. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ తరఫున పోటీ చేయాలని ఆశిస్తున్న నేత. ఎన్నికల వ్యూహప్రతివ్యూహాలు, ప్రచారం ముమ్మరం అవుతున్న వేళ... ఆమె కాసేపు సరదాగా గడిపారు. మసాలా దోశ వేశారు. దక్షిణ భారత దేశ మూలాల్ని గుర్తుచేసుకున్నారు.

మిండీతో కలిసి...

అమెరికాలో ప్రఖ్యాత కమెడియన్, నటి, రచయిత మిండీ కలింగ్​తో కలిసి వంటల కార్యక్రమంలో పాల్గొన్నారు కమల. ఇందుకు లాస్​ ఏంజిల్స్​లోని మిండీ నివాసం వేదికైంది.

మిండీ అసలు పేరు వీర మిండీ చొకలింగం. ఆమె కూడా భారత సంతతి వ్యక్తి. కమలది చెన్నై. అందుకే దక్షిణ భారత దేశ వంటకమైన మసాలా దోశను ఎంచుకున్నారు. ఇద్దరూ కలిసి కూరగాయలు కోసి, మసాలా తయారు చేసి... రుచికరమైన దోశలు వేశారు.

ఈ వీడియోను కమల సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​ చేయగా... మంచి స్పందన లభిస్తోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

దోశల రాజకీయం!

డెమొక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థిగా నిలవాలని ఆశిస్తున్నారు కమల. ఇందుకోసం ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.

మసాలా దోశ తయారీ కార్యక్రమంలో ఎక్కడా రాజకీయాలు ప్రస్తావించలేదు కమల. కానీ అంతర్లీనంగా జరిగింది మాత్రమే ప్రచారమే.

వలసదారుల విషయంలో ట్రంప్​ కఠినంగా వ్యవహరిస్తున్నారన్నది ప్రత్యర్థుల ప్రధాన విమర్శ. ఇక్కడ కమల, మిండీ ఇద్దరూ వలసదారుల కుటుంబాలకు చెందిన వారే. మసాలా దోశ వేస్తున్నంత సేపు వారు... దక్షిణ భారత దేశంతో వారికి ఉన్న అనుబంధం గురించి, తమ కుటుంబం వలస రావడం గురించి, ఇతర వలసదారుల కథల గురించి చర్చించుకున్నారు. అలా ట్రంప్​కు పరోక్షంగా కౌంటర్​ ఇస్తూ... అమెరికాలో అధిక సంఖ్యలో ఉండే వలసదారుల ఓట్లకు వల వేశారు కమల.

డెమొక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్లు ఇటీవలే దిగ్గజ వ్యాపారవేత్త మైకేల్​ బ్లూమ్​బర్గ్​ ప్రకటించారు. ట్రంప్​ను ఢీకొట్టాలంటే ముందుగా బ్లూమ్​బర్గ్​తో పాటు మరికొందరు డెమొక్రాట్​ ఆశావహ అభ్యర్థుల్ని ప్రాథమిక ఎన్నికల్లో కమల ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ విషయంలో ఆమె ఏ మేర సఫలం అవుతారో వేచి చూడాలి.

AP Video Delivery Log - 0500 GMT News
Wednesday, 27 November, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0416: US Pompeo HKong China AP Clients Only 4241984
Pompeo on HKong elex, China's treatment of Uighurs
AP-APTN-0322: South Korea Mekong Summit AP Clients Only 4241985
First South Korea-Mekong Summit held in Busan
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.