ఈజిప్టులోని సునాయ్ ద్వీపకల్పంలో ఘోర ప్రమాదం జరిగింది. పెట్రోలింగ్ నిర్వహిస్తున్న భద్రతా సిబ్బంది వాహనం.. రోడ్డుపై పడిఉన్న బాంబును ఢీకొట్టడంతో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు భద్రతా సిబ్బంది మృతి చెందారు. ఐదుగురు గాయపడ్డారు.
గతంలోనూ..
గత మూడు రోజుల్లో శుక్రవారం జరిగిన బాంబు ప్రమాదం రెండోది. ఈ దాడి వెనుక ఎవరున్నారన్నది మాత్రం కచ్చితంగా తెలియదు. కానీ గతంలో జరిగిన దాడి తామే చేశామని ఇస్లామిక్ స్టేట్ గ్రూప్స్ ప్రకటించాయి. గజా సరిహద్దుల్లో బుధవారం జరిగిన బాంబు పేలుడులో ఒక భద్రతా సిబ్బంది మరణించారు.
వారే లక్ష్యంగా..
సునాయ్ ద్వీపకల్పంలో ఇస్లామిక్ అంతర్గత తిరుగుబాటుతో ఈజిప్టు అట్టుడుకుతోంది. ఇస్లామిక్ అధ్యక్షుడు మహమ్మద్ మోర్సీని 2013లో మిలిటరీ దళాలు గద్దె దించిన తర్వాత దాడులు మరీ అధికం అయ్యాయి. భద్రతా దళాలు, క్రిష్టియన్ మైనారిటీ వర్గాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరుగుతున్నాయి.
ఇదీ చదవండి:నాగలాండ్- మణిపూర్ సరిహద్దుల్లో కార్చిచ్చు