ETV Bharat / entertainment

పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన నటి పూర్ణ..!

author img

By

Published : Apr 4, 2023, 5:26 PM IST

Updated : Apr 4, 2023, 9:39 PM IST

టాలీవుడ్​ హీరోయిన్​ పూర్ణ సోమవారం ఓ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ వార్తను ఇన్​స్టా వేదిక ద్వారా అభిమానులకు షేర్​ చేసింది.

tollywood-heroine-poorna-blessed-with-a-baby-boy
tollywood heroine poorna

టాలీవుడ్​ హీరోయిన్​ పూర్ణ సోమవారం ఓ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ వార్తను తన అభిమానుల కోసం సోషల్​ మీడియాలో షేర్​ చేసింది. దుబయ్​లోని ఓ ప్రైవేట్​ ఆస్పత్రిలో ఆమె ప్రసవించింది. బెడ్​పై బాబును ఎత్తుకొని హాస్పిటల్ సిబ్బందితో తీసుకున్న ఫొటోను ఆమె తన ఇన్​స్ట్రాలో షేర్​ చేసింది. తల్లీ బిడ్డా ఇద్దరూ క్షేమంగా ఉన్నారని ఆమె ఫ్యామిలీ వర్గాలు తెలిపారు. గత ఏడాది అక్టోబర్​లో దుబాయ్​కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఆసీఫ్ అలీని వివాహం చేసుకున్న పూర్ణ. ఆ తర్వతా కొద్ది రోజులకే తల్లిని కాబోతున్నట్లు ప్రకటించింది. ఇక ఇటీవలే తన సీమంతం వేడుకలకు సంబంధించిన ఫొటోలను కూడా సోషల్​ మీడియాలో షేర్​ చేసింది. ఈ వేడుకకు పలువురు సెలబ్రిటీలు సైతం హాజరై సందడి చేశారు. ఆ ఫొటోలతో బేబీ బంప్​లో పలు ఫొటోలను షేర్​ చేసింది. పూర్ణ ఈ శుభవార్త చెప్పడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సోషల్​ మీడియా వేదికగా శుభాకంక్షలు తెలుపుతున్నారు.

ఇటీవలే రిలీజైన నాని సినిమాలోనూ ఓ కీలక పాత్రలో నటించింది పూర్ణ. తెలుగు ఇండస్ట్రీకి సుపరిచితురాలైన ఈ మలయాళ హీరోయిన్​.. 2004లో 'మంజు పోలోరు పెంకుట్టి' అనే సినిమాతో తెరంగేట్రం చేసింది. ఈ సినిమా తర్వాత మాలీవుడ్​లో పలు క్యారెక్టర్ రోల్స్ చేసిన పూర్ణ.. అక్కడ నుంచి టాలీవుడ్​కు షిఫ్ట్ అయింది. 'శ్రీ మహాలక్ష్మి' సినిమాతో తెలుగులోకి అడుగు పెట్టిన పూర్ణ ఆ తర్వాత అల్లరి నరేశ్​ హీరోగా నటించిన 'సీమ టపాకాయ్​' సినిమాతో టాలీవుడ్​లో సుపరిచితురాలయ్యింది. రవిబాబు దర్శకత్వంలో వచ్చిన 'అవును', 'అవును 2' సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. 'సీమ టపాకాయి','లడ్డు బాబు' 'నువ్విలా నేనిలా', 'అవును', 'దృశ్యం 2' 'శ్రీమంతుడు', , 'అఖండ' లాంటి సినిమాల్లో కీలక పాత్రలు పోషించింది. ఇక టాలీవుడ్​లో పలు క్యారెక్టర్​ రోల్స్ చేస్తూ... డ్యాన్స్ ప్రోగ్రామ్స్​కు జడ్జీగా వ్యవహరిస్తోంది. ఈ టీవీలో ప్రసారమైన 'ఢీ' అనే డ్యాన్స్​ షో కు జడ్జీగా వ్యవహరించి బుల్లితెర ప్రేక్షకులను అలరించింది. దీంతో పాటు పలు ప్రోగ్రామ్​లకు జడ్జీగా వ్యవహరిస్తూ బుల్లితెరపై సందడి చేసింది.

దశాబ్దానికి పైగా తెలుగు, మలయాళ, తమిళ, ఇండస్ట్రీల్లో నటించి తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్​ను సొంతం చేసుకున్న పూర్ణ .. పలు సినిమాల్లో అడపాదడపా కనిపించినప్పటికీ హీరోయిన్​గా మంచి పేరు సంపాదించింది. తెలుగులో ఈమె నటించిన ఆఖరి సినిమా 'తీస్‌ మార్ ఖాన్'. అటు సినిమాల్లో నటిస్తూనే ఇటు బల్లితెరపై కూడా సందడి చేసింది.

టాలీవుడ్​ హీరోయిన్​ పూర్ణ సోమవారం ఓ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ వార్తను తన అభిమానుల కోసం సోషల్​ మీడియాలో షేర్​ చేసింది. దుబయ్​లోని ఓ ప్రైవేట్​ ఆస్పత్రిలో ఆమె ప్రసవించింది. బెడ్​పై బాబును ఎత్తుకొని హాస్పిటల్ సిబ్బందితో తీసుకున్న ఫొటోను ఆమె తన ఇన్​స్ట్రాలో షేర్​ చేసింది. తల్లీ బిడ్డా ఇద్దరూ క్షేమంగా ఉన్నారని ఆమె ఫ్యామిలీ వర్గాలు తెలిపారు. గత ఏడాది అక్టోబర్​లో దుబాయ్​కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఆసీఫ్ అలీని వివాహం చేసుకున్న పూర్ణ. ఆ తర్వతా కొద్ది రోజులకే తల్లిని కాబోతున్నట్లు ప్రకటించింది. ఇక ఇటీవలే తన సీమంతం వేడుకలకు సంబంధించిన ఫొటోలను కూడా సోషల్​ మీడియాలో షేర్​ చేసింది. ఈ వేడుకకు పలువురు సెలబ్రిటీలు సైతం హాజరై సందడి చేశారు. ఆ ఫొటోలతో బేబీ బంప్​లో పలు ఫొటోలను షేర్​ చేసింది. పూర్ణ ఈ శుభవార్త చెప్పడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సోషల్​ మీడియా వేదికగా శుభాకంక్షలు తెలుపుతున్నారు.

ఇటీవలే రిలీజైన నాని సినిమాలోనూ ఓ కీలక పాత్రలో నటించింది పూర్ణ. తెలుగు ఇండస్ట్రీకి సుపరిచితురాలైన ఈ మలయాళ హీరోయిన్​.. 2004లో 'మంజు పోలోరు పెంకుట్టి' అనే సినిమాతో తెరంగేట్రం చేసింది. ఈ సినిమా తర్వాత మాలీవుడ్​లో పలు క్యారెక్టర్ రోల్స్ చేసిన పూర్ణ.. అక్కడ నుంచి టాలీవుడ్​కు షిఫ్ట్ అయింది. 'శ్రీ మహాలక్ష్మి' సినిమాతో తెలుగులోకి అడుగు పెట్టిన పూర్ణ ఆ తర్వాత అల్లరి నరేశ్​ హీరోగా నటించిన 'సీమ టపాకాయ్​' సినిమాతో టాలీవుడ్​లో సుపరిచితురాలయ్యింది. రవిబాబు దర్శకత్వంలో వచ్చిన 'అవును', 'అవును 2' సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. 'సీమ టపాకాయి','లడ్డు బాబు' 'నువ్విలా నేనిలా', 'అవును', 'దృశ్యం 2' 'శ్రీమంతుడు', , 'అఖండ' లాంటి సినిమాల్లో కీలక పాత్రలు పోషించింది. ఇక టాలీవుడ్​లో పలు క్యారెక్టర్​ రోల్స్ చేస్తూ... డ్యాన్స్ ప్రోగ్రామ్స్​కు జడ్జీగా వ్యవహరిస్తోంది. ఈ టీవీలో ప్రసారమైన 'ఢీ' అనే డ్యాన్స్​ షో కు జడ్జీగా వ్యవహరించి బుల్లితెర ప్రేక్షకులను అలరించింది. దీంతో పాటు పలు ప్రోగ్రామ్​లకు జడ్జీగా వ్యవహరిస్తూ బుల్లితెరపై సందడి చేసింది.

దశాబ్దానికి పైగా తెలుగు, మలయాళ, తమిళ, ఇండస్ట్రీల్లో నటించి తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్​ను సొంతం చేసుకున్న పూర్ణ .. పలు సినిమాల్లో అడపాదడపా కనిపించినప్పటికీ హీరోయిన్​గా మంచి పేరు సంపాదించింది. తెలుగులో ఈమె నటించిన ఆఖరి సినిమా 'తీస్‌ మార్ ఖాన్'. అటు సినిమాల్లో నటిస్తూనే ఇటు బల్లితెరపై కూడా సందడి చేసింది.

Last Updated : Apr 4, 2023, 9:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.