ETV Bharat / entertainment

'ఆదిత్య 999' సీక్వెల్​పై బాలయ్య క్రేజీ అప్డేట్​.. ప్రీ ప్రొడక్షన్​ వర్క్స్​ షురూ!

ఆదిత్య 999 సీక్వెల్​పై అప్డేట్ ఇచ్చారు నందమూరి నటసింహం బాలయ్య. ఏం చెప్పారంటే

author img

By

Published : Nov 19, 2022, 10:59 AM IST

Balakrishna Aditya 999
Balakrishna Aditya 999

నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో 'ఆదిత్య 369' ఒకటి. సింగీతం శ్రీనివాసరావు దర్శకుడు. అప్పట్లో వచ్చిన ఈ చిత్రం ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో అందరికి తెలిసిందే. ఆ చిత్రానికి కొనసాగింపుగా 'ఆదిత్య 999 మాక్స్​' సినిమా చేయబోతున్నట్లు గతంలో బాలకృష్ణ ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు మళ్లీ ఎలాంటి అప్‌డేట్‌ ఇ‍వ్వలేదు. దీంతో ఆ సినిమా సెట్స్‌పైకి వెళ్తుందో లేదో అనునుకున్నారు. తాజాగా 'ఆదిత్య 999' సీక్వెల్​ కచ్చితంగా ఉంటుందని బాలకృష్ణ స్పష్టం చేశారు.

వచ్చే ఏడాది ఆదిత్య 999 సీక్వెల్​ చిత్రాన్ని ప్రారంభించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అందుకు సంబంధించిన పనులు కొనసాగుతున్నట్లు స్పష్టం చేశారు. ఆ చిత్రానికి తానే దర్శకత్వం వహించబోతున్నట్లు స్పష్టం చేశాకు. యంగ్‌ హీరో విశ్వక్ సేన్ నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన దాస్ కా ధమ్కీ ట్రైలర్ హైదరాబాద్ ఏఎంబీ మాల్​లో బాలయ్య లాంఛనంగా ఆవిష్కరించారు.

ఇక విశ్వక్​ గురించి మాట్లాడుతూ.. "అప్పుడప్పుడూ కొన్ని సినిమాల్ని చూస్తున్నప్పుడు వాటిలో నన్ను నేను ఊహించుకుంటా. నాకు అన్నీ చేయాలని ఉంటుంది. ఈ ట్రైలర్‌ చూస్తుంటే నేనే చేశాననేంతగా తృప్తిని కలిగించారు విశ్వక్​సేన్‌. ట్రైలర్‌ కనులవిందుగా ఉంది. రచన, నృత్యాలు, కెమెరా పనితనం బాగున్నాయి. విష్వక్‌ సినిమాపై తపనతో పనిచేస్తుంటారు. ఎన్నో ఒడుదొడుకుల్ని దాటుకుని ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. దర్శకుడిగా, నిర్మాతగా, హీరోగా.. ఇలా అన్నీ తానై, తన బృందానికి స్ఫూర్తినిస్తూ ఈ సినిమాని పూర్తి చేశారు. ఇప్పుడున్న యువతరంలో ఇలా చేయడం చాలా అరుదు" అని చెప్పారు.

ఇదీ చూడండి: ఈ అందాల ముద్దుగుమ్మలు డాక్టర్లు కూడా

నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో 'ఆదిత్య 369' ఒకటి. సింగీతం శ్రీనివాసరావు దర్శకుడు. అప్పట్లో వచ్చిన ఈ చిత్రం ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో అందరికి తెలిసిందే. ఆ చిత్రానికి కొనసాగింపుగా 'ఆదిత్య 999 మాక్స్​' సినిమా చేయబోతున్నట్లు గతంలో బాలకృష్ణ ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు మళ్లీ ఎలాంటి అప్‌డేట్‌ ఇ‍వ్వలేదు. దీంతో ఆ సినిమా సెట్స్‌పైకి వెళ్తుందో లేదో అనునుకున్నారు. తాజాగా 'ఆదిత్య 999' సీక్వెల్​ కచ్చితంగా ఉంటుందని బాలకృష్ణ స్పష్టం చేశారు.

వచ్చే ఏడాది ఆదిత్య 999 సీక్వెల్​ చిత్రాన్ని ప్రారంభించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అందుకు సంబంధించిన పనులు కొనసాగుతున్నట్లు స్పష్టం చేశారు. ఆ చిత్రానికి తానే దర్శకత్వం వహించబోతున్నట్లు స్పష్టం చేశాకు. యంగ్‌ హీరో విశ్వక్ సేన్ నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన దాస్ కా ధమ్కీ ట్రైలర్ హైదరాబాద్ ఏఎంబీ మాల్​లో బాలయ్య లాంఛనంగా ఆవిష్కరించారు.

ఇక విశ్వక్​ గురించి మాట్లాడుతూ.. "అప్పుడప్పుడూ కొన్ని సినిమాల్ని చూస్తున్నప్పుడు వాటిలో నన్ను నేను ఊహించుకుంటా. నాకు అన్నీ చేయాలని ఉంటుంది. ఈ ట్రైలర్‌ చూస్తుంటే నేనే చేశాననేంతగా తృప్తిని కలిగించారు విశ్వక్​సేన్‌. ట్రైలర్‌ కనులవిందుగా ఉంది. రచన, నృత్యాలు, కెమెరా పనితనం బాగున్నాయి. విష్వక్‌ సినిమాపై తపనతో పనిచేస్తుంటారు. ఎన్నో ఒడుదొడుకుల్ని దాటుకుని ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. దర్శకుడిగా, నిర్మాతగా, హీరోగా.. ఇలా అన్నీ తానై, తన బృందానికి స్ఫూర్తినిస్తూ ఈ సినిమాని పూర్తి చేశారు. ఇప్పుడున్న యువతరంలో ఇలా చేయడం చాలా అరుదు" అని చెప్పారు.

ఇదీ చూడండి: ఈ అందాల ముద్దుగుమ్మలు డాక్టర్లు కూడా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.