ETV Bharat / entertainment

సినీనటి మీనా భర్త మృతి.. పావురాలే కారణమా?

సినీనటి మీనా ఇంట విషాదం నెలకొంది. గత కొన్నేళ్లుగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ఆమె భర్త విద్యాసాగర్​ మంగళవారం చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.ఈ ఏడాది ఆయనకు కరోనా రావడం వల్ల ఆయన ఆరోగ్యం విషమించింది. 2009లో మీనాకు విద్యాసాగర్​తో వివాహం అయింది.

author img

By

Published : Jun 29, 2022, 7:17 AM IST

Updated : Jun 29, 2022, 12:02 PM IST

సినీనటి మీనా
సినీనటి మీనా

ప్రముఖ నటి మీనా భర్త విద్యాసాగర్‌ (48) మంగళవారం రాత్రి హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. శ్వాసకోశ సమస్యతో ఆయన మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. కాగా, విద్యాసాగర్‌ మృతికి సంబంధించి తమిళనాడు స్థానిక పత్రికల్లో పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పావురాల వ్యర్థాల నుంచి వచ్చే గాలిని ఎక్కువగా పీల్చడం వల్లే ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని స్థానిక మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.

.
.

మీనా వాళ్లింటికి అతి చేరువలో పావురాలు ఎక్కువ సంఖ్యలో ఉంటాయని.. వాటి వ్యర్థాల నుంచి వచ్చిన గాలిని పీల్చడం వల్లే ఆయనకు శ్వాసకోశ సమస్యలు తలెత్తాయని, గత కొంతకాలంగా దానికి సంబంధించిన చికిత్స తీసుకుంటున్నారని ఆయా పత్రికల్లో కథనాలు ప్రచూరితమయ్యాయి. ఇదిలా ఉండగా ఈ ఏడాది ఆరంభంలో ఆయనకు కరోనా రావడంతో సమస్య మరింత తీవ్రమైందని, దీంతో వైద్యులు ఊపిరితిత్తుల మార్పిడి చేయించాలని సూచించినప్పటికీ దాతలు దొరక్కపోవడంతోనే విద్యాసాగర్‌ మృతి చెందారని సమాచారం.

ఇక, మీనా-విద్యాసాగర్‌ 2009లో వివాహం చేసుకున్నారు. వీరిది పెద్దలు కుదిర్చిన పెళ్లి. ఈ దంపతులకు నైనికా అనే కుమార్తె ఉంది. నైనికా ఇప్పటికే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. విజయ్‌ 'తేరీ', అరవింద్‌ స్వామి 'భాస్కర్‌ ఓరు రాస్కెల్‌'లో బాలనటిగా మెప్పించారు.

ఇదీ చూడండి : రామ్​చరణ్​ ఇంటికి బాలీవుడ్ స్టార్స్ క్యూ.. ఏంటి కథ?

ప్రముఖ నటి మీనా భర్త విద్యాసాగర్‌ (48) మంగళవారం రాత్రి హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. శ్వాసకోశ సమస్యతో ఆయన మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. కాగా, విద్యాసాగర్‌ మృతికి సంబంధించి తమిళనాడు స్థానిక పత్రికల్లో పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పావురాల వ్యర్థాల నుంచి వచ్చే గాలిని ఎక్కువగా పీల్చడం వల్లే ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని స్థానిక మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.

.
.

మీనా వాళ్లింటికి అతి చేరువలో పావురాలు ఎక్కువ సంఖ్యలో ఉంటాయని.. వాటి వ్యర్థాల నుంచి వచ్చిన గాలిని పీల్చడం వల్లే ఆయనకు శ్వాసకోశ సమస్యలు తలెత్తాయని, గత కొంతకాలంగా దానికి సంబంధించిన చికిత్స తీసుకుంటున్నారని ఆయా పత్రికల్లో కథనాలు ప్రచూరితమయ్యాయి. ఇదిలా ఉండగా ఈ ఏడాది ఆరంభంలో ఆయనకు కరోనా రావడంతో సమస్య మరింత తీవ్రమైందని, దీంతో వైద్యులు ఊపిరితిత్తుల మార్పిడి చేయించాలని సూచించినప్పటికీ దాతలు దొరక్కపోవడంతోనే విద్యాసాగర్‌ మృతి చెందారని సమాచారం.

ఇక, మీనా-విద్యాసాగర్‌ 2009లో వివాహం చేసుకున్నారు. వీరిది పెద్దలు కుదిర్చిన పెళ్లి. ఈ దంపతులకు నైనికా అనే కుమార్తె ఉంది. నైనికా ఇప్పటికే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. విజయ్‌ 'తేరీ', అరవింద్‌ స్వామి 'భాస్కర్‌ ఓరు రాస్కెల్‌'లో బాలనటిగా మెప్పించారు.

ఇదీ చూడండి : రామ్​చరణ్​ ఇంటికి బాలీవుడ్ స్టార్స్ క్యూ.. ఏంటి కథ?

Last Updated : Jun 29, 2022, 12:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.