ETV Bharat / crime

Accident: వాహనం బోల్తా.. వ్యక్తి మృతి - నాగర్ కర్నూల్ జిల్లా వార్తలు

నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీశైలం ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రం వద్ద ఓ వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ కాంట్రాక్టు ఉద్యోగి అక్కడికక్కడే మృతి చెందాడు.

accident
accident
author img

By

Published : May 28, 2021, 10:37 PM IST

నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం శ్రీశైలం ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రం వద్ద ప్రమాదవశాత్తు ఓ వాహనం బోల్తా పడింది. ఈ ఘటనలో ఓ కాంట్రాక్టు ఉద్యోగి అక్కడికక్కడే ప్రాణాలు విడువగా.. తీవ్ర గాయాల పాలైన డ్రైవర్​ను ఆసుపత్రికి తరలించారు.

దోమలపెంటకు చెందిన శివలింగం(35).. విద్యుత్ కేంద్రంలో కాంట్రాక్టు ఎలక్ట్రీషన్​గా విధులు నిర్వహించేవాడు. ఇవాళ సాయంత్రం వాహనంలో విధులకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుడి కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్ గ్రేషియాతో పాటు అతడి భార్యకు జలవిద్యుత్ కేంద్రంలో ఉద్యోగం ఇవ్వాలని స్థానికులు డిమాండ్ చేశారు. మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం శ్రీశైలం ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రం వద్ద ప్రమాదవశాత్తు ఓ వాహనం బోల్తా పడింది. ఈ ఘటనలో ఓ కాంట్రాక్టు ఉద్యోగి అక్కడికక్కడే ప్రాణాలు విడువగా.. తీవ్ర గాయాల పాలైన డ్రైవర్​ను ఆసుపత్రికి తరలించారు.

దోమలపెంటకు చెందిన శివలింగం(35).. విద్యుత్ కేంద్రంలో కాంట్రాక్టు ఎలక్ట్రీషన్​గా విధులు నిర్వహించేవాడు. ఇవాళ సాయంత్రం వాహనంలో విధులకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుడి కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్ గ్రేషియాతో పాటు అతడి భార్యకు జలవిద్యుత్ కేంద్రంలో ఉద్యోగం ఇవ్వాలని స్థానికులు డిమాండ్ చేశారు. మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ఇదీ చదవండి: Mahabubnagar: బండారుపల్లి వాగులో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.