ETV Bharat / crime

దారుణం: మూడేళ్ల చిన్నారిని గొంతుకోసి చంపిన మేనమామ - crime news

ఎపీలోని విజయనగరం జిల్లాలో దారుణం జరిగింది. గుమ్మలక్ష్మీపురం మండలం పెంగవ గ్రామంలో ఓ చిన్నారిని అత్యంత కిరాతకంగా గొంతుకోసి హతమార్చాడు ఓ దుర్మార్గుడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

brutal murder in vizianagaram
మూడేళ్ల చిన్నారిని గొంతుకోసి హత్య చేసిన మేనమామ
author img

By

Published : Jun 12, 2021, 2:52 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం పెంగవ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. కిల్లక భవ్యశ్రీ అనే మూడేళ్ల చిన్నారిని వరసకు మేనమామ అయ్యే వినోద్​ అనే వ్యక్తి కిరాతకంగా హత్య చేశాడు. గత అర్ధరాత్రి చిన్నారి నిద్రిస్తున్న సమయంలో గొంతుకోసి దారుణంగా చంపేశాడు.

వినోద్​ మతిస్థిమితం సరిగా లేక దారుణానికి పాల్పడినట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడు. ఘటనా స్థిలికి చేరుకున్న ఎల్విన్​పేట ఎస్సై కృష్ణ ప్రసాద్ ప్రాథమిక విచారణ చేపట్టారు. కేసు నమోదుచేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్​లోని విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం పెంగవ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. కిల్లక భవ్యశ్రీ అనే మూడేళ్ల చిన్నారిని వరసకు మేనమామ అయ్యే వినోద్​ అనే వ్యక్తి కిరాతకంగా హత్య చేశాడు. గత అర్ధరాత్రి చిన్నారి నిద్రిస్తున్న సమయంలో గొంతుకోసి దారుణంగా చంపేశాడు.

వినోద్​ మతిస్థిమితం సరిగా లేక దారుణానికి పాల్పడినట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడు. ఘటనా స్థిలికి చేరుకున్న ఎల్విన్​పేట ఎస్సై కృష్ణ ప్రసాద్ ప్రాథమిక విచారణ చేపట్టారు. కేసు నమోదుచేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.

ఇవీ చదవండి: వేగంగా వచ్చి.. బస్సుని ఢీకొని యువకుడు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.