యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు పురపాలిక కేంద్రంలో ఓ మహిళ, మరో యువకుడితో కలిసి వివాహేతర సంబంధం విషయంలో... విద్యుత్ శాఖలో పనిచేసే ఓ లైన్ మెన్ను బెదిరించి డబ్బులు వసూలు చేశారు. పట్టణ కేంద్రానికి చెందిన 28 ఏళ్ల యువకుడు, 38 ఏళ్ల మహిళ కలిసి తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని బాధితుడు ఆరోపించారు.
అదే పనిగా పలుమార్లు డబ్బులు డిమాండ్ చేయడంతో బాధితుడు మోత్కూరు పోలీసులను ఆశ్రయించాడు. వెంటనే నిందితులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: మాస్క్ లేదని జరిమానా- మార్షల్పై మహిళ దాడి