హైదరాబాద్ బీఎన్ రెడ్డి ప్రాంతంలోని ఓ మందుల దుకాణంలో కోవిఫర్ టీకాను నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరకు విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను... వనస్థలిపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా విక్రయించటమే కాక.. కృత్రిమ కొరత సృష్టిస్తున్నారన్న సమాచారం మేరకు... తనిఖీలు చేసినట్లు తెలిపారు.
ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా మందులను ఎంఆర్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తూ... ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. దుకాణం యజమాని పైడిషెట్టి రాజేశ్, మరో వ్యక్తి గంగాభరి మహేశ్ను అరెస్టు చేసినట్లు తెలిపారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: శ్రీరామ నవమి శోభాయాత్ర రద్దు: ఎమ్మెల్యే రాజా సింగ్